జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా, మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రం శైవ భక్తుడు, ధీరుడైన గిరిజన యోధుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. దేవుడిపై అతని విశ్వాసం ఎలా అతని జీవితం మార్చిందో ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. క్లైమాక్స్ సన్నివేశాల్లో మంచు విష్ణు నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి.ఈ చిత్రంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించగా ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, కాజల్ అగర్వాల్ వంటి తారాగణం కీలక పాత్రల్లో కనిపించారు.