టాలీవుడ్ పెద్దలకు మరో బిగ్ షాక్ తగిలింది. గతంలో మేకర్స్ కు నిద్రలేకుండా చేసిన ఐబొమ్మ.. మరోసారి ఇండస్ట్రీకి అగ్నిపరీక్ష పెట్టింది. ఈసారి అంతకు మించి సినిమా చూపించడానికి రెడీ అవుతోంది.
టాలీవుడ్ కు మరోసారి పైరసీ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టాలీవుడ్ పెద్దలకు నిద్రలేకుండా చేసిన ఐబొమ్మ వెబ్సైట్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఐబొమ్మ యాక్టివ్ అవ్వడంతో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి ఆందోళన స్టార్ట్ అయ్యింది. ఈ పైరసీ వెబ్సైట్ ఓనర్ రవి అరెస్ట్ అవ్వడంతో పైరసీ సమస్య చాలా వరకూ తగ్గిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ తాజాగా కొత్త డొమైన్లతో ఈ సైట్ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిందన్న వార్త టాలీవుడ్ ను కలవరపెడుతోంది.
25
సినీ ప్రముఖులకు పెద్ద షాక్
తాజాగా థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు హెచ్డీ క్వాలిటీతో ఈ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుండటం నిర్మాతలు, దర్శకులు , సినీ ప్రముఖులను షాక్కు గురిచేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే సినిమాలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతుండటంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడుతున్నట్లు సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
35
ఐ బొమ్మ రీ ఎంట్రీ?
నిజానికి గతంలోనే ఐబొమ్మ తమ సైట్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, కొన్ని సాంకేతిక మార్పులతో కొత్త డొమైన్లను ఉపయోగిస్తూ.. ఈ సైట్ మళ్లీ మొదలయ్యింది, ఈసారి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలే కాకుండా, ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారమ్లలో విడుదలయ్యే కంటెంట్ను కూడా ఈ వెబ్సైట్ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్లు సమాచారం. దీనివల్ల నిర్మాతలు కోట్లాది రూపాయల నష్టాలను ఎదుర్కోక తప్పేట్లు లేదు.
పైరసీని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ, కొత్త లింకులు , మిర్రర్ డొమైన్ల ద్వారా ఇలాంటి వెబ్సైట్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు, యాంటీ పైరసీ సెల్ అలర్ట్ అయ్యాయి. ఈ వెబ్సైట్ల వెనుక ఉన్న నెట్వర్క్ను గుర్తించే పనిని వారు ఇప్పటికే మొదలు పెట్టారు. అసలు ఈ సైట్ ను మళ్లీ మొదలెట్టింది ఎవరు అనే కోణంలో విచారణ జరుగుతున్నట్టు సమాచారం.
55
వేలాది సినీ కార్మికుల కష్టం..
సినిమా నిర్మాణం వెనుక వేలాది మంది కార్మికులు, టెక్నీషియన్ల కష్టం ఉంది. నిర్మాతల పెట్టుబడి కూడా ఉంది. కొంత మంది నిర్మాతలు అప్పులు చేసి సినిమాలు చేస్తుంటారు. అలాంటి టైమ్ లో పైరసీ కారణంగా వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరు మాదిరి అయ్యిందని ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు పైరసీ వెబ్సైట్లను ప్రోత్సహించకుండా థియేటర్లలో కానీ.. అధికారిక ఓటీటీలో కానీ సినిమాలు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఐబొమ్మపై నెక్ట్స్ ఎటువంటి చర్చలు తీసుకుంటారు. ఏం చేయబోతున్నారు అనేది చూడాలి.