మౌనీ, సూరజ్ ఇప్పుడు కలిసి ఉండటం లేదని, వేర్వేరుగా ఉంటున్నారని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు పెరుగుతున్నాయని కొన్ని రిపోర్టులు ఆరోపించాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. మౌనీ గానీ, సూరజ్ గానీ ఈ ప్రచారాన్ని ఖండించలేదు, అంగీకరించలేదు.వీరి మధ్య ఏర్పడ్డ మనస్పర్థలతో పాటు, ఆర్థిక వ్యవహారాలు కూడా విడాకులకు కారణం అంటూ వార్తలు వస్తున్నాయి. మౌనీ రాయ్ డబ్బుని సూరజ్ మోసపూరితంగా వాడుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.