Kiara Advani
పలుచనైన నల్ల చీర ధరించిన కియారా అద్వానీ (Kiara Advani)పొరల మాటు నుండి నడుము, నాభీ చూపిస్తూ మంటలు రేపింది. స్లీవ్ లెస్ జాకెట్ లో ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు గుండెలకు గాయం చేసింది. కియారా లేటెస్ట్ ఫోటో షూట్ లో హాట్ హాట్ గ్లామర్ తో సోషల్ మీడియాను ఊపేసింది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.
Kiara Advani
ఇక కియారా హీరోయిన్ గా నటించిన భూల్ భులియా 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు అందుకుంటుంది. ఇప్పటి వరకు రూ. 184 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Kiara Advani
ఆ మూవీ థియేటర్స్ లో ఉండగానే మరో హిట్ మూవీ డెలివరీ చేసింది. ఈ శుక్రవారం విదులైన జగ్ జగ్ జియో (Jug Jug Jeeyo )సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అనిల్ కపూర్, వరుణ్ ధావన్ నటించిన ఈ మూవీ ఫస్ట్ డే రూ. 10 కోట్ల వసూళ్లు అందుకుంది. సెకండ్ డే సైతం సత్తాచాటిన ఈ మూవీ రెండు రోజులకు రూ. 21.8 కోట్ల వసూళ్లు అందుకుంది.
Kiara Advani
ఇక కియారా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది. `ఎంఎస్ధోని` చిత్రంతో పాపులర్ అయిన కియారా తెలుగులో మహేష్తో `భరత్ అనే నేను` చిత్రంలో నటించింది. ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. మహేష్కి లవర్గా ఆమె నటన, అందచందాలు ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేశాయి.
Kiara Advani
రామ్చరణ్తో `వినయ విధేయ రామ`లో మెరిసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. కానీ చెర్రీ, కియారా జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఈ సారి పాన్ ఇండియా సినిమా కోసం కలిసి నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ 15వ చిత్రం భారీ బడ్జెట్తో రూపొందుతుంది. దిల్రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన `షేర్షా` చిత్రంతో విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. రియల్ లైఫ్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్ టాక్ని తెచ్చుకుంది.
Kiara Advani
ప్రస్తుతం కియారా `మిస్టర్ లేలే` చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఇవి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక రామ్చరణ్ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడతో పాటు హిందీలో విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ తో భారీ ఫేమ్ సొంతం చేసుకున్న చరణ్ (Ram Charan) నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి.
ఇక చాలా కాలంగా సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా ప్రేమాయణం నడుపుతున్నారు. అయితే దీనిపై వీరెప్పుడు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే వీరిద్దరికీ చెడిందన్న టాక్ వినిపిస్తుంది. విబేధాల కారణంగా బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇటీవల ఓ పార్టీలో ఈ జంట కలిసి సందడి చేశారు.