Devatha: సత్య కోసం ఆదిత్యను తిట్టిన దేవుడమ్మ.. జానకమ్మని బయపెడుతున్న మాధవ్!

First Published Oct 4, 2022, 2:00 PM IST

Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..దేవుడమ్మ ఆదిత్యను తిడుతూ, ఎప్పుడూ ఆఫీస్ పనులే కాకుండా ఇంట్లో మనుషులను కూడా చూసుకోవాలి. సత్య నిన్నే నమ్ముకుని ఉన్నది తనని జాగ్రత్తగా చూడాలి. అలాంటి తన మనసును బాధ పెట్టకూడదు కదా అని అనగా, నాకు తన మనసును బాధ పెట్టడం ఇష్టం లేదమ్మా కానీ నేను అర్జెంట్గా వెళ్లాలి ఇది చాలా అవసరం అయినది. తర్వాత నేను సత్యన్ని తీసుకొని వెళ్తాను ఈ పనులన్నీ అయిన తర్వాత ఇద్దరు ప్రశాంతంగా గడపొచ్చు అని అనగా, ఈ పనులు ఇంకెప్పుడూ అవుతాయి ఎప్పుడు ఉండేవే కదా అని దేవుడమ్మ అంటుంది.
 

దానికి ఆదిత్య కోప్పడి,నేను రాలేనమ్మ దయచేసి నన్ను బలవంతం పెట్టొద్దు అని అనగా, సత్య బాధపడుతూ బయటకు వెళ్ళిపోతుంది. ఆరోజు రాత్రి జానకమ్మ పడుకున్నప్పుడు మాధవ్ సైలెంట్ గా అక్కడికి వచ్చి జానకమ్మ వేపుడు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంతలో జానకమ్మ లెగిసి మాధవ్ నీ చూసి ఉలుక్కుపడుతుంది. అప్పుడు మాధవ్ జానకమ్మ తో ,చూసావు కదా నా గురించి బయట పెట్టాలి అనుకున్నావు నీకు ఈ పరిస్థితి వచ్చింది. అయినా నాకు లేని కంగారు ఆఫీసర్ గాడికి ఎందుకు?నేనే పట్టించుకోవట్లేదు అంటే వాడు పట్టించుకోకుండా ఉండాలి కదా.
 

నిన్ను  డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు వాడు,దాని పని అయిపోయింది. ఇప్పుడు ప్రకృతి వైద్యశాల అంటున్నాడు ఎలాగా రెండు రోజులు ఉంటాం కదా అక్కడ చెప్తాను వాడి పని. రాధ నాది. మా ఇద్దరి మధ్యకి ఎవరూ రాలేరు అని జానకమ్మకి బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మాధవ్. ఆ తర్వాత రోజు ఉదయం దేవుడమ్మకి సత్య కాఫీ ఇస్తుంది. ఆదిత్య లెగిసాడా అని దేవుడమ్మ అడగగా, ఏమో తెలీదు ఆంటీ అని సత్య అంటుంది. వాడు పట్టించుకోవడం లేదు అని నువ్వు పట్టనట్టు ఉంటున్నావా అని దేవుడమ్మ అనగా, వద్దు ఆంటీ ఆదిత్య కి ఎందుకు బలవంతం పెట్టడం అని అంటుంది సత్య.
 

ఇంతలో ఆదిత్య లగేజ్ పట్టుకొని బయలుదేరుతాడు ఎక్కడికి వెళ్తున్నావ్ అని దేవుడమ్మ అడగగా, నాకు చిన్న పని ఉన్నదమ్మ ఇంటికి రావడానికి రెండు రోజులు పడతాది అని అంటాడు ఆదిత్య.ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు సరిగ్గా ఇంటికి రావడం లేదు అంటే ఇంక బయటకు వెళ్తున్నావు సత్య ఏమవుతుంది అని అంటుంది దేవుడమ్మ. అలా కాదమ్మా నేను కచ్చితంగా వెళ్లాలి అక్కడ నా అవసరం ఉన్నది లేకపోతే నేను వెళ్ళను కదా అని చెప్పి బయలుదేరుతాడు. ఆదిత్య అక్కడి నుంచి జానకమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ప్రకృతి చికిత్సలయానికి వెళ్ళడానికి బయలుదేరుతారు.
 

 అప్పుడు దేవి, నేను అక్క ఆఫీసర్ సర్ కార్ ఎక్కుతాము అని అనగా, చిన్మయి,నువ్వు కూడా రా అమ్మ. తాతయ్య, నాన్న,నానమ్మ ఒక కారులో ఎక్కుతారు అని అంటుంది. అప్పుడు మాధవ్, ఏం అవసరం లేదు.రాద మా కార్ లోనే వస్తుంది అని అనగా రామ్మూర్తి, మన కారులో అంతమందిని కుక్కించడం ఎందుకు ఎలాగా ఇంకో కారు ఉన్నది కదా అని అంటాడు. అప్పుడు రాధా మాధవ్ వైపు గీరగా చూసి ఆదిత్య కార్ ఎక్కుతుంది.మరోవైపు సత్య రాధ వాళ్ళ ఇంటికి వస్తూ దారిలో, అక్క నన్ను, ఆదిత్యని కలపడానికి అప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అనుకున్నాను కానీ ఇప్పుడు దేవి పేరుతో ఆదిత్య చుట్టున తిరుగుతుంది.
 

ఈ రోజు వెళ్లి అక్కని నిలదీయాలి అని అక్కడికి వెళ్లి చూసేసరికి తలుపులు వేసి ఉంటాయి. మరోవైపు ఆదిత్య వాళ్ళందరూ చికిత్సలయం కి వస్తారు. అప్పుడు ఆ డాక్టర్ జరిగిన విషయం అంతా తెలుసుకొని ఈవిడకి కచ్చితంగా రెండు మూడు రోజుల్లో నయమైపోతుంది అని అంటుంది. దానికి ఇంట్లో వాళ్ళందరూ సంబరపడగామాధవ్ కొంచెం భయపడతాడు. అప్పుడు రాధ, ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా పర్లేదు తగ్గిన తర్వాతే వెళ్తాము అని అంటుంది. అప్పుడు మాధవ్,మొన్న కూడా అలాగే ఎవరో వచ్చి రెండు రోజులు లో తగ్గిపొద్ధి అన్నారు.
 

తర్వాత వాళ్ల మొఖం కూడా కనిపించలేదు అని అంటాడు. అప్పుడు ఆ డాక్టర్ అలా ఏం జరగదు కచ్చితంగా ఏమవుతుంది అని హామీ ఇస్తుంది. అప్పుడు మాధవ్ బయటకు వెళ్లి ఎవరికో ఫోన్ చేస్తాడు. మరోవైపు రుక్మిణి ఆదిత్యలు మాట్లాడుకుంటూ ఉంటారు. రుక్మిణి బాధగా ఉన్నప్పుడు ఏమైంది రుక్మిణి జానకమ్మ గారికి ఇంకేం అవ్వదా అని చెప్పారు కదా అని ఆదిత్య అనగా, నేను బాధపడుతుంది వాళ్ల గురించి కాదు పెనిమిటి, సత్య గురించి. అది నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాది కానీ పదేపదే దేవి మీ ఇంటికి వస్తే తను బాధపడుతుంది.తన గురించి కూడా ఆలోచించు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!