ఆ తర్వాత రోహిత్, దేబ్జానీ.. రామ్ ప్రసాద్, త్రిగుణ్ ఆడిన గేమ్ లో రోహిత్ చాలా డేంజర్ గా ఫిజికల్ అటాక్ చేసిన దృశ్యాలని నాగార్జున చూపించారు. రోహిత్ మాత్రం తాను చాలా జాగ్రత్తగా ఆడానని చెప్పారు. కానీ ఆడియన్స్ ఒప్పుకోలేదు. రోహిత్ చేసింది తప్పు అని తేల్చేశారు. దీనితో రోహిత్ క్షమాపణలు చెప్పారు. వర్షిణి, రామ్ ప్రసాద్ సంచాలకులుగా ఫెయిల్ అయిన విషయాన్ని కూడా నాగ్ ప్రస్తావించారు. ఇక ముఖేష్, దేబ్జానీ, రామ్ ప్రసాద్, షాలిని నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. వర్షిణి, సుధీర్, కృష్ణుడు, సృష్టి, రోహిత్, త్రిగుణ్ నామినేషన్స్ లోనే ఉన్నారు. ఈ వారం హౌస్ లో అస్సలు కనిపించలేదు అని నాగార్జున చెప్పిన కృష్ణుడు, సృష్టి లలో ఒకరు ఆదివారం రోజు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.