నటి కయాదు లోహర్ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. తన కిల్లర్ లుక్స్తో కుర్రకారును ఫిదా చేస్తున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది.
యూత్ క్రష్గా మారిపోయిన కయాదు లోహర్ గురించి సినీ లవర్స్కు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామరస్ లుక్స్, యాక్టింగ్తో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ, తాజాగా తన లేటెస్ట్ ఫొటోషూట్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
26
అస్సాంలోని తేజ్పూర్ సొంతూరు
కయాదు లోహర్ 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్పూర్లో జన్మించింది. 2021లో జరిగిన 'పుణె ఫ్రెష్ ఫేస్' పోటీల్లో ఆమె విన్నర్గా నిలిచింది. ఈ విజయమే ఆమెకు సినిమా ఇండస్ట్రీ తలుపులు తెరిచేలా చేసింది.
36
'ముగిల్ పేట'తో ఎంట్రీ
2021లో వచ్చిన కన్నడ సినిమా 'ముగిల్ పేట'తో కయాదు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2022లో రిలీజైన 'పాతోన్పతమ్ నూట్టాండు' సినిమాతో మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇటీవల వచ్చిన 'డ్రాగన్' సినిమాతో కయాదు లోహర్కు మరింత క్రేజ్ దక్కింది. ఈ సినిమాలో తన గ్లామరస్ లుక్స్తో సినీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ భామ, ఇప్పుడు యూత్ ఫేవరెట్గా మారిపోయింది.
56
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
ప్రస్తుతం కయాదు లోహర్ తెలుగు, మరాఠీ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. 'తారం', 'ఇదయం మురళి' లాంటి సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది.నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 24న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
66
వైరల్ అవుతున్న ఫొటోలు
అప్పుడప్పుడు తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది కయాదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె కిల్లర్ లుక్స్కు నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.