ఇక ఇంత వరకూ సావిత్రిని ఒక్క మాట అన్నవారు లేదు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. పబ్లిక్ గా సావిత్రిని విమర్శించిన వారు లేదు. అసలు ఇప్పటి వారికి ఆ అర్హత కూడా లేదు. కాని ఎటువంటి అర్హత లేకుండా, కనీసం నటిగా కూడా సరైన గుర్తింపు లేని బిగ్ బాస్ గీతూరాయల్ మహానటి సావిత్రిపై విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.
సోషల్ మీడియా పుణ్యమా అని కాస్త పాపులారిటీ తెచ్చుకున్న గీతూ.. ఆతరువాత బిగ్ బాస్ లో అడుగు పెట్టి అక్కడ కూడా తన మార్క్ చూపించాలని చూసింది. తనదైన ఆటతీరు చూపించడంతో పాటు.. కొన్ని విషయాల్లో ఆడియన్స్ తో చివాట్లు కూడా తిన్నది.
Also Read: నాటుకోడితో 20 ఇడ్లీలు, 2 లీటర్ల యాపిల్ జూస్, సీనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తినే ఫుడ్ లో ఇకేమున్నాయంటే?