కథ:
పేదవారికి అండగా, ఊరికి పెద్దగా ఉండే మురళి కృష్ణ (బాలకృష్ణ) ఎవరికి అన్యాయం జరిగినా సహించడు. ఈ క్రమంలో అదే ఊరికి కలెక్టర్ గా శరణ్య (ప్రగ్యా జైస్వాల్)వస్తుంది. బాలయ్య మంచితనం, ఊరి కోసం, ప్రజల కోసం ఆయన పడే తాపత్రయం, నిస్వార్థమైన మనసు చూసి ఆకర్షితురాలు అవుతుంది. అలా మురళి కృష్ణ, శరణ్య మధ్య ప్రేమ చిగురిస్తుంది. అనంతరం ఇద్దరూ వివాహం చేసుకొని వైవాహిక జీవితం మొదలుపెడతారు. అదే ఊరిలో వరదరాజులు(శ్రీకాంత్) అక్రమ మైనింగ్ జరుపుతూ ఉంటాడు. కాపర్ మైనింగ్స్ లో అకృత్యాలు సాగిస్తూ ఉంటాడు. ఆ మైనింగ్స్ వలన చుట్టు ప్రక్కల ఉన్న గ్రామ ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది తెలుసుకున్న మురళి కృష్ణ రంగంలోకి దిగుతాడు. వరదరాజులును ఎదిరిస్తాడు. దీనితో మురళి కృష్ణను తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపించి తనకు అడ్డులేకుండా చేసుకుంటాడు. మురళి కృష్ణ జైలుపాలు కావడంతో వరదరాజులు అరాచకాలు మితిమీరిపోతాయి. చివరికి శరణ్యకు ఆమె కుటుంబానికి వరదరాజులు నుండి ప్రమాదం ఏర్పడుతుంది. ఈ నిస్సహాయ స్థితిలో బాలయ్య అఖండ గా ఎంట్రీ ఇస్తాడు. ఈ అఖండ ఎవరు? అతడు క్రూరుడైన వరదరాజులుకు ఎలా చెక్ పెట్టాడు? మురళి కృష్ణ కుటుంబంతో అతనికి సంబంధం ఏమిటీ? అనేది మిగతా కథ