చెప్పు తెగుద్ది.. అన‌సూయ స్ట్రాంగ్ వార్నింగ్‌, ఫైర్ అయిన స్టార్ యాంకర్, కారణం ఇదే?

Published : Aug 02, 2025, 03:02 PM IST

స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రతీ సారి సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేసే అనసూయ, ఈసారి డైరెక్ట్ గా ఫైర్ అయ్యారు. 

PREV
15

అనసూయ స్టార్ డమ్

యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ ఆతరువాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇటు యాంకర్ గా బుల్లితెరపై స్టార్ డమ్ సంపాదించి, అటు నటిగా కూడా అద్భుతమైన పాత్రలు చేస్తూ.. టాలీవుడ్ లో దూసుకుపోతుంది. జబర్థస్త్ ద్వారా ఫేమస్ అయిన అనసూయ, వెండితెరపై రంగస్థలం, పుష్ప లాంటి పెద్ద సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసింది. ఇక అనసూయ లీడ్ క్యారెక్టర్ చేస్తూ చాలా సినిమాలు థియేటర్లలో, ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. ఇటు నటిగా కంటీన్యూ అవుతూనే అటు సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా అనసూయ కొనసాగుతున్నారు. అంతే కాదు యాడ్స్ ద్వారా బ్రాండ్ ఓపెనింగ్స్ తో ఇండస్ట్రీలో బిజీ బిజీగా గడిపేస్తోంది అనసూయ.  చేతి నిండా సంపాదిస్తోంది కూడా. 

DID YOU KNOW ?
అనసూయ ఇన్ స్టా ఫాలోవర్స్
స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. ఒక్క ఇన్ స్టా గ్రామ్ లోనే అనసూయను 16 లక్షలకు పైగా అభిమానులు ఫాలో అవుతున్నారు.
25

అనసూయ వివాదాలు

అనసూయ తన కెరీర్ లో చాలా వివాదాలు ఫేస్ చేశారు. కోట శ్రీనివాసరావు లాంటి సీనియర్ నటుల కామెంట్ల కు కూడా ఆమె కౌంటర్ ఇచ్చి హైలెట్ అయ్యారు. విజయ్ దేవరకొండ తో సోషల్ మీడియా వివాదం గురించి అందరికి తెలిసిందే. ఇక అనసూయ డ్రెస్సింగ్ స్టైల్ పై, యాంకరింగ్ స్టైల్ పై ఎన్నో విమర్శలు ఫేస్ చేస్తూ వచ్చింది. అంతే కాదు తన భర్త, పిల్లల విషయంలో కూడా ఈ స్టార్ యాంకర్ ట్రోల్స్ ఎదుర్కోక తప్పలేదు. అయితే ప్రతీ దానికి ఆమె ఘాటుగా రిప్లే ఇస్తూ వస్తోంది. ఏ విషయంలోను తగ్గకుండా ఫైర్ బ్రాండ్ అన్న పేరు తెచ్చుకుంది అనసూయ.

35

అనసూయ ఫైర్

తాజాగా మరోసారి వార్తల్లోకెక్కారు అనసూయ. ఓ ఈవెంట్ లో ఆమెపై కొందరు యువకులు అసభ్య వ్యాఖ్యలు చేయడంతో, వారి ప్రవర్తనపై ఆమె ఘాటుగా స్పందించింది. ఇది ఎంత వరకూ కరెక్ట్ అంటూ వారిని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రీసెంట్ గా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అనసూయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యూత్ ఆడియన్స్ హాజరయ్యారు. ఇక వారిని ఉద్దేశించి అనసూయ మాట్లాడుతుండగా, కొందరు యువకులు అనుచితంగా ప్రవర్తిస్తూ అసభ్యకర కామెంట్లు చేశారు.

45

చెప్పు తెగుద్ది అంటూ ఆగ్రహం

ఈ పరిస్థితిని గమనించిన అనసూయ తీవ్రంగా స్పందించింది. "చెప్పు తెగుద్ది" అంటూ వారిని హెచ్చరించింది. ఆమె మాట్లాడుతూ, "మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య లేదా మీ కాబోయే భార్యపై ఇలా కామెంట్స్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలానే మిమ్మల్ని మీరే ఓపికతో చూస్తారా? పెద్దవారిని గౌరవించాలన్న సంస్కారం మీ ఇంట్లో నేర్పించలేదా?" అంటూ యువకుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసింది అనసూయ.

55

అనసూయకు సోషల్ మీడియా నుంచి సపోర్ట్

అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి భారీగా షేర్ అవుతున్నాయి. అనసూయ మాటల్లో కనిపించిన ఆవేశం, బాధ అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ కు కూడా కోపం తెప్పిస్తున్నాయి. దాంతో జనాలు కూడా ఆలోచనలో పడ్డారు. అనసూయ నటిగా మాత్రమే కాకుండా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గానూ గుర్తింపు పొందారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, లైంగిక వేధింపులపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.ఇక అనసూయపై జరిగిన ఈ ఘటన విషయంలో ఆమె చేసిన కామెంట్స్ కు సోషల్ మీడియాలో మద్దతు పెరిగింది.

ఒకపక్క టీవీ యాంకర్‌గా, మరోపక్క సినీ నటి‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్‌ పై ఇలా బహిరంగంగా అగౌరవపర్చుతూ కామెంట్లు చేయడం. అసభ్యంగా ప్రవర్తించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ ఘటనలో పాల్గొన్న యువకులపై స్థానికంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో అనసూయ స్పందించిన తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇలా ప్రతి మహిళ ధైర్యంగా ఎదిరిస్తేనే మార్పు వస్తుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories