ఈ కాంబినేషన్ మళ్లీ రావాలని అల్లు అర్జున ఫ్యాన్స్ తో పాటు, ఆయన తండ్రి, గీతా ఆర్ట్స్ నిర్మాత అల్లు అరవింద్ కూడా కోరుకుంటున్నారట. ఈ డ్రీమ్ కాంబోకి ఇప్పటివరకు టైమ్ కుదరకపోయినా, తాజా సమాచారం ప్రకారం ‘సరైనోడు 2’ ప్రాజెక్ట్పై పచ్చజెండా ఊపినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బోయపాటి శ్రీను, అల్లు అర్జున్, అల్లు అరవింద్ల మధ్య ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కథా చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కథకు బన్నీ, అరవింద్ మంచి రెస్పాన్స్ ఇచ్చారని సమాచారం.