Actor Giri Babu: సీనియర్ నటుడు గిరిబాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ నిర్మాణ అనుభవాలను పంచుకున్నారు. సినిమా పట్ల తనకున్న మక్కువతో నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం వంటి విభాగాల్లోనూ ఆయన రాణించారు. అయితే, తన కుమారుడు బోస్ బాబు హీరోగా..
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. అయితే, తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అతిపెద్ద ఆర్థిక నష్టం గురించి ఆయన ఇటీవల ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
25
నిర్మాణంలో క్రమశిక్షణ
గిరిబాబు సినిమాను ఎంతో పక్కాగా ప్లాన్ చేసేవారు. సెట్కు వెళ్ళే ముందే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని, ఏ సీన్ ఎన్ని నిమిషాలు వస్తుందో వాచ్ పెట్టుకుని మరీ లెక్క వేసుకునేవారు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గేవి. పాత కాలపు మహామహులైన డైరెక్టర్ల నుంచి తాను ఈ క్రమశిక్షణను నేర్చుకున్నానని ఆయన చెప్పారు.
35
'కొదమ సింహం' ఎఫెక్ట్
తన కుమారుడు బోస్ బాబును హీరోగా పరిచయం చేస్తూ 'ఇంద్రజిత్' అనే భారీ కౌబాయ్ సినిమాను గిరిబాబు నిర్మించారు. అదే సమయంలో చిరంజీవి 'కొదమ సింహం' కూడా షూటింగ్లో ఉంది. నిజానికి 'కొదమ సింహం' కంటే ముందే 'ఇంద్రజిత్' విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆ చిత్ర యూనిట్ ప్లాన్ మార్చి తమ సినిమాను హడావిడిగా ముందుగానే విడుదల చేశారని గిరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
'కొదమ సింహం' విడుదల కావడంతో, గిరిబాబు సినిమాను కొనడానికి వచ్చిన బయ్యర్లు వెనక్కి తగ్గిపోయారు. "చిరంజీవి సినిమానే ఆడనప్పుడు, కొత్తవాడితో తీసిన కౌబాయ్ సినిమా ఎలా హిట్ అవుతుంది?" అని వారు ప్రశ్నించారు. దీనివల్ల గిరిబాబు ప్రెస్టేజ్ కోసం రూ. 40 లక్షల విలువైన ఆ సినిమాను రూ. 20 లక్షలకే అమ్మాల్సి వచ్చింది. అలా ఆ ఒక్క సినిమాతోనే ఆయనకు రూ. 20 లక్షల నష్టం వాటిల్లింది.
55
ఒక అడిక్షన్ అని
సినిమా అంటే ఒక అడిక్షన్ అని, గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ రంగుల ప్రపంచం మనల్ని వెన్నాడుతూనే ఉంటుందని గిరిబాబు అభివర్ణించారు. ఎన్ని నష్టాలు వచ్చినా, పట్టుదలతో ముందుకు సాగడమే తన విజయ రహస్యమని ఆయన పేర్కొన్నారు.