Zimbabwe vs India: జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20లో భారత యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. తొలి మ్యాచ్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతడు, ఈ మ్యాచ్లో కూడా అదే జోరును కొనసాగిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
వైభవ్ సూర్యవంశీ కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 49 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. 165.31 స్ట్రైక్రేట్తో దూకుడుగా ఆడిన వైభవ్ సెంచరీ దిశగా పయనిస్తున్న సమయంలో వెస్లీ మధేవెరే బౌలింగ్లో బ్రాడ్ ఎవాన్స్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సెంచరీ మిస్ అయినా, జట్టు భారీ స్కోర్కు బలమైన పునాది వేసి వెళ్లాడు.
24
భారత్కు శుభారంభం.. వైభవ్-ఇషాన్ కీలక భాగస్వామ్యం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆరంభం ఇచ్చాడు. మరో ఎండ్లో అభిషేక్ శర్మ త్వరగా ఔటైనా, ఇషాన్ కిషన్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇషాన్ 26 బంతుల్లో 29 పరుగులు చేయగా, ఇద్దరూ కలిసి జట్టుకు స్థిరమైన స్కోరింగ్ను అందించారు. పవర్ప్లే నుంచే బౌండరీలు బాదుతూ జింబాబ్వే బౌలర్లపై ఒత్తిడి తీసుకొచ్చాడు వైభవ్.
34
అయ్యర్, రింకూ మెరుపులు.. 190 దాటిన టీమిండియా
వైభవ్ ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 27 పరుగులతో వేగంగా ఆడాడు. చివర్లో రింకూ సింగ్ 13 బంతుల్లోనే 25 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ ఉండగా, 192కు పైగా స్ట్రైక్రేట్తో ఆడాడు. చివర్లో తిలక్ వర్మ కూడా నాటౌట్గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
Make that a 2️⃣nd T20I half-century 🫡
Vaibhav Sooryavanshi putting on a show again in Harare 👏#TeamIndia 95/1 after 10 overs.
జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. బ్లెస్సింగ్ ముజరబానీ, వెస్లీ మధేవెరే, సికందర్ రజా తలో వికెట్ సాధించారు. అయితే భారత బ్యాటర్లు నిరంతరం వేగంగా పరుగులు చేయడంతో ఏ బౌలర్ కూడా పూర్తి స్థాయిలో మ్యాచ్పై పట్టు సాధించలేకపోయాడు. చివరి ఐదు ఓవర్లలోనే భారత్ 47 పరుగులు రాబట్టడం జట్టు ఇన్నింగ్స్కు మరింత ఊపు తీసుకొచ్చింది.