Zanai Bhosle : ఆశా బోంస్లే మనవరాలితో సిరాజ్‌ రిలేషన్ ఏంటి..? ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ

Published : Apr 14, 2026, 08:30 PM ISTUpdated : Apr 14, 2026, 08:46 PM IST

ఆశా భోంస్లే అంత్యక్రియల్లో ఒక దృశ్యం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఆమె మనవరాలు, సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న జానై భోంస్లేను క్రికెటర్ సిరాజ్ ఓదారుస్తున్న వీడియో వైరల్ అయింది. మరి వీరిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసా..? 

PREV
14
ఎవరీ జానై బోంస్లే..?

ఆశా బోంస్లే మనవరాలు జానై బోంస్లే పేరు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో బాగా వినిపిస్తోంది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడంతో చిన్నప్పటి నుంచే సినిమాలు, నటనపై ఆసక్తి పెంచుకుంది జానై. ఈ క్రమంలోనే సినీ రంగంలోకి ప్రవేశించిన ఆమె ప్రస్తుతం ఓ పాన్ ఇండియా మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా ఆశా బోంస్లే మనవరాలిగానే కాదు నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తోంది.

ఇటీవల కాంతారా మూవీతో సూపర్ హిట్ కొట్టిన రిషబ్ శెట్టి హీరోగా రాబోతున్న ఓ భారీ హిస్టారికల్ డ్రామాతో జానై హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె రాణి సాయి భోంసాలే పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. మరాఠా రాజవంశంతో బోంస్లే కుటుంబానికి చారిత్రక సంబంధాలున్న నేపథ్యంలో ఈ పాత్రపై మరింత ఆసక్తి పెరిగింది.

24
జానైతో క్లోజ్ గా కనిపించిన క్రికెటర్ సిరాజ్...

సినిమా డెబ్యూతో వార్తల్లో నిలుస్తున్న జానై, ఇటీవల తన నానమ్మ మరణంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. 92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూయగా, ముంబైలో జరిగిన ఆమె అంత్యక్రియల్లో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఈ కష్ట సమయంలో జానైని పలువురు ప్రముఖులు ఓదార్చారు.

అంత్యక్రియలకు హాజరైన వారిలో హైదరబాద్ కు చెందిన భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కూడా ఉన్నారు. ఆయన జానైని ఓదారుస్తున్న వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో జానై, సిరాజ్ ల మధ్య బంధంపై అనేక వార్తలు వచ్చాయి. దీనికి జానై బోంస్లే ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో క్లారిటీ ఇచ్చింది.

34
జానై, సిరాజ్ మధ్య రిలేషన్ ఏంటి..?

 జానై, మహ్మద్ సిరాజ్‌ను తన అన్నయ్యలా భావిస్తుంది. గతంలో వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు వచ్చినప్పుడు రాఖీ పండుగ జరుపుకుని తాము అన్నాచెల్లెళ్లమని స్పష్టం చేశారు. ఇలా సిరాజ్ కు రాఖీ కడుతున్న వీడియోనే జానై ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఈ వీడియోనే ఇప్పుడు కూడా సిరాజ్, జానై బంధంపై క్లారిటీ ఇచ్చింది. తాను సోదరిలా భావించే అమ్మాయి విషాదంలో ఉండగా అన్నలా ఆమెను ఓదార్చాడు… ఇలా ఆమె పక్కన నిలబడటం అందరినీ కదిలించింది.

44
ఆశా బోంస్లే మరణంపై ప్రముఖులు నివాళి

ఇదిలావుంటే ఆశా భోంస్లే మృతికి నివాళులు వెల్లువెత్తాయి. ఆమె అంత్యక్రియలకు ఆశా పరేఖ్, రితేష్ దేశ్‌ముఖ్, టబు వంటి సినీ ప్రముఖులు హాజరై తుది వీడ్కోలు పలికారు.

దుఃఖంలో ఉన్న జానైని టబు, రితేష్ దేశ్‌ముఖ్ ఓదార్చారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఠాక్రే కూడా వచ్చి ఆశా బోంస్లే మరణంపై సంతాపం తెలిపారు… కుటుంబసభ్యులను ఓదార్చారు. 

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆశా భోంస్లేకు నివాళులర్పించి కన్నీటిపర్యంతమయ్యారు. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, జావేద్ అలీ, రాకేష్ రోషన్, సుదేష్ భోంస్లే, ఏఆర్ రెహమాన్ వంటి వారు కూడా అంత్యక్రియకు హాజరయ్యారు. ఇలా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులే కాదు సినీ అభిమానులు, సంగీతప్రియులు ఆశా బోంస్లే మరణంతో విషాదంలో మునిగారు… కుటుంబసభ్యులకు అండగా నిలిచారు. 

Read more Photos on
click me!

Recommended Stories