ఇదిలావుంటే ఆశా భోంస్లే మృతికి నివాళులు వెల్లువెత్తాయి. ఆమె అంత్యక్రియలకు ఆశా పరేఖ్, రితేష్ దేశ్ముఖ్, టబు వంటి సినీ ప్రముఖులు హాజరై తుది వీడ్కోలు పలికారు.
దుఃఖంలో ఉన్న జానైని టబు, రితేష్ దేశ్ముఖ్ ఓదార్చారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఠాక్రే కూడా వచ్చి ఆశా బోంస్లే మరణంపై సంతాపం తెలిపారు… కుటుంబసభ్యులను ఓదార్చారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆశా భోంస్లేకు నివాళులర్పించి కన్నీటిపర్యంతమయ్యారు. జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, జావేద్ అలీ, రాకేష్ రోషన్, సుదేష్ భోంస్లే, ఏఆర్ రెహమాన్ వంటి వారు కూడా అంత్యక్రియకు హాజరయ్యారు. ఇలా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులే కాదు సినీ అభిమానులు, సంగీతప్రియులు ఆశా బోంస్లే మరణంతో విషాదంలో మునిగారు… కుటుంబసభ్యులకు అండగా నిలిచారు.