ఈసారి టోర్నమెంట్లో జట్ల సంఖ్యను 10 నుంచి 12కు పెంచారు. మొత్తం 33 మ్యాచ్లు 24 రోజుల పాటు జరుగుతాయి. ఇందులో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో పాటు ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్ వంటి జట్లు కూడా పోటీపడతాయి. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ట్రోఫీ టూర్ కూడా నిర్వహిస్తారు. ఇది మొదట స్కాట్లాండ్లో ప్రారంభమై చివరగా లండన్లో ముగుస్తుంది.
వేగంగా ఎదుగుతోన్న ఉమెన్ క్రికెట్
ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. జట్ల సంఖ్య పెంచడం, ప్రైజ్ మనీ పెరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీ స్థాయి పెరుగుతుందని ఆయన తెలిపారు.