Yashasvi Jaiswal : విరాట్ కోహ్లీ కంటే స్పీడ్ గురూ.. 6 ఇన్నింగ్స్‌ల్లోనే జైస్వాల్ వరల్డ్ రికార్డ్

Published : Jun 21, 2026, 08:42 AM IST

Yashasvi Jaiswal Record: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. యశస్వి జైస్వాల్ సెంచరీతో రికార్డుల మోత మోగించాడు. ఈ  సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.

PREV
16
జైస్వాల్ ఊచకోత.. ధవన్, కోహ్లీ రికార్డులు బ్రేక్.. ఆఫ్ఘనిస్తాన్ క్లీన్ స్వీప్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన మూడో, చివరి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో భారత్ ఓడించింది. ఈ బిగ్ విక్టరీతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ముందుగా ప్రసిద్ధ్ కృష్ణ కెరీర్ బెస్ట్ బౌలింగ్ (5/23)తో ఆఫ్ఘన్‌ను దెబ్బతీయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్ (110 నాటౌట్), రోహిత్ శర్మ (79) వీరవిహారం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ సెంచరీ (102) చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ధాటికి అది కేవలం ఒక సాధారణ ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది. 219 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం 28.4 ఓవర్లలోనే ఒకే ఒక వికెట్ కోల్పోయి 224 పరుగులు చేసి ఛేదించింది.

26
జైస్వాల్ వరల్డ్ రికార్డ్.. ధావన్, కోహ్లీ రికార్డులు ఖతం

ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో యశస్వి జైస్వాల్ ఒక అరుదైన రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్ హిస్టరీలో తన మొదటి 6 ఇన్నింగ్స్‌ల్లోనే రెండు సెంచరీలు బాదిన మొదటి భారతీయ బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. ఈ క్రమంలో అతను టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ రికార్డును బద్దలు కొట్టాడు.

ధావన్ తన మొదటి రెండు వన్డే సెంచరీలను 7 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, జైస్వాల్ కేవలం 6 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఫీట్ సాధించాడు. అంతేకాదు, టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ (17 ఇన్నింగ్స్‌లు), శుభ్‌మన్ గిల్ (18 ఇన్నింగ్స్‌లు) కంటే చాలా వేగంగా జైస్వాల్ ఈ మైలురాయిని అందుకోవడం విశేషం.

36
భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 2 వన్డే సెంచరీలు చేసిన ప్లేయర్స్
  1. యశస్వి జైస్వాల్ - 6 ఇన్నింగ్స్‌లు
  2. శిఖర్ ధవన్ - 7 ఇన్నింగ్స్‌లు
  3. కేదార్ జాదవ్ - 9 ఇన్నింగ్స్‌లు
  4. విరాట్ కోహ్లీ - 17 ఇన్నింగ్స్‌లు
  5. శుభ్‌మన్ గిల్ - 18 ఇన్నింగ్స్‌లు
46
రోహిత్-జైస్వాల్ జోడీ విధ్వంసం.. ఫ్రీ పెనాల్టీ రన్స్

భారత ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందే విచిత్రంగా టీమిండియా స్కోరు బోర్డు 5/0 కు చేరింది. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ షాహిదీ పిచ్‌పై పెనాల్టీ జోన్‌లోకి పదే పదే పరిగెత్తడంతో అంపైర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు 5 పరుగుల పెనాల్టీ విధించారు. ఆ ఐదు పరుగులు భారత్‌కు లభించాయి. ఇక ఛేదనలో జైస్వాల్ మొదటి ఓవర్ నుంచే అటాకింగ్ మోడ్ ఆన్ చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు బాదాడు. ఆ 9 బంతుల ఓవర్లో పెనాల్టీ రన్స్‌తో కలిపి ఏకంగా 23 పరుగులు వచ్చాయి.

రోహిత్ శర్మ మొదట్లో కాస్త స్లోగా ఆడినా, ఆ తర్వాత తన మార్క్ షాట్లతో 'హిట్ మ్యాన్' అవతారం ఎత్తాడు. ఆఫ్ఘన్ ప్రధాన స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ ఒక ఫోర్, ఒక సిక్స్ బాది క్లాస్ చూపించాడు. జైస్వాల్ కేవలం 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, రోహిత్ శర్మ 47 బంతుల్లో యాభై మార్కు దాటాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 22.5 ఓవర్లలోనే 170 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మొహమ్మద్ నబీ వేసిన బంతిని పుల్ చేయబోయి డీప్ మిడ్-వికెట్‌లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సెదిఖుల్లా అటల్‌కు క్యాచ్ ఇచ్చి రోహిత్ (79) అవుటయ్యాడు. కానీ జైస్వాల్ మాత్రం తగ్గలేదు. నబీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే నబీ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి టీమిండియాకు విక్టరీ అందించాడు.

ఆఫ్ఘనిస్తాన్‌పై అత్యంత వేగంగా వన్డే సెంచరీ చేసిన ప్లేయర్ల లిస్ట్‌లో కూడా జైస్వాల్ 83 బంతులతో చోటు సంపాదించాడు. ఈ సిరీస్‌లోనే మూడు అత్యంత వేగవంతమైన సెంచరీలు నమోదు కావడం విశేషం.

56
ప్రసిద్ధ్ కృష్ణ ‘ఫైవ్ స్టార్’ బౌలింగ్ స్పెల్

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ను కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ తన స్వింగ్, లెంగ్త్‌తో కోలుకోలేని దెబ్బ తీశాడు. చేపాక్ పిచ్‌పై పర్ఫెక్ట్ లెంగ్త్ తో బౌలింగ్ వేస్తూ రహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా.. ఈ ముగ్గురూ ప్రసిద్ధ్ వేసిన అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను డ్రైవ్ చేయబోయి ఫస్ట్ స్లిప్‌లో రోహిత్ శర్మకు సులువైన క్యాచ్‌లు ఇచ్చారు.

ఆ తర్వాత దర్విష్ రసూలి పుల్ షాట్ ఆడబోగా, మిడ్-ఆఫ్ నుంచి శ్రేయాస్ అయ్యర్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో 10 ఓవర్లలోపే ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన జస్ప్రీత్ బుమ్రా, జవగల్ శ్రీనాథ్, మహమ్మద్ సిరాజ్ వంటి ఎలైట్ పేసర్ల లిస్ట్‌లో ప్రసిద్ధ్ చేరిపోయాడు. 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆఫ్ఘన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

66
కెప్టెన్ షాహిదీ ఒంటరి పోరాటం

భారీ పతనం అంచున ఉన్న జట్టును కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 117 బంతుల్లో 105 పరుగులు జోడించారు. షాహిదీ యాంకర్ రోల్ ప్లే చేస్తూ 64 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, ఒమర్జాయ్ దూకుడుగా ఆడుతూ 55 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఒమర్జాయ్ (50) ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ప్రసిద్ధ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

ఆ తర్వాత షాహిదీ, మొహమ్మద్ నబీ (57 బంతుల్లో 37 పరుగులు) కలిసి ఆరో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. 80 పరుగుల వద్ద షాహిదీ తీవ్రమైన కండరాల నొప్పులతో ఇబ్బంది పడినప్పటికీ పోరాటం ఆపలేదు. 128 బంతుల్లో తన వన్డే కెరీర్‌లో మొదటి సెంచరీ మార్కును అందుకున్నాడు. నబీ అవుటైన తర్వాత ఆఫ్ఘన్ వికెట్లు వేగంగా పడిపోయాయి. కానీ షాహిదీ నొప్పితోనే బ్యాటింగ్ చేస్తూ జట్టు స్కోరును 200 దాటించాడు. చివరకు ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories