సౌతాఫ్రికా టూర్ లో భారత జట్టు.. మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 లు ఆడుతుంది. కానీ ఇటీవల ఆ దేశంలో విజృంభించిన ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తితో దక్షిణాఫ్రికా ను ప్రపంచ దేశాలు ‘హై రిస్క్’ కంట్రీగా భావిస్తున్నాయి. అంతేగాక ఆ దేశంతో పాటు ఆఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు కూడా మొదలయ్యాయి. ఈనేపథ్యంలో ఇండియా-సౌతాఫ్రికా టూర్ ఎంతమేరకు విజయవంతమవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.