ICC T20 World Cup - India : టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలు ఇప్పటికే తమ కోరికను బీసీసీఐ ముందు వెల్లడించారని సమాచారం. అయితే, ఇద్దరు స్టార్ ప్లేయర్ల భవిష్యత్తు గురించి బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే విషయం గురించి చర్చించడానికి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ దక్షిణాఫ్రికాకు వెళ్లి సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడనున్నారు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం 30 మంది ప్రాబబుల్స్ ను వీక్షించనున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ రెండింటిలోనూ కోహ్లీ, రోహిత్ అద్భుతంగా రాణించారు. దీంతో ఇద్దరిని జట్టులోకి తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి కానీ.. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.