T20 World Cup: ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లో 10 సెకండ్ల యాడ్ వేయాలంటే ఎంత ఖ‌ర్చ‌వుతుందో తెలుసా.?

Published : Feb 08, 2026, 01:38 PM IST

T20 World Cup: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఫిబ్ర‌వ‌రి 15న రెండు దేశాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కి సంబంధించి స‌స్పెన్స్ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఒక ఆస‌క్తిక‌ర క‌థ‌నం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
భారత్–పాక్ మ్యాచ్ పై ఇంకా సస్పెన్స్

T20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. ఫిబ్రవరి 15న మ్యాచ్ ఉండాల్సి ఉన్నా, పాకిస్థాన్ ఆడేందుకు నిరాకరించిన నేపథ్యంలో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ విషయంలో ఐసీసీతో చర్చలు జరుపుతూ పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. ఈ అనిశ్చితి మధ్య మరో అంశం ఆసక్తిగా మారింది. అదే భారత్–పాక్ మ్యాచ్ సమయంలో ఒక ప్రకటనకు ఎంత ఖర్చవుతుంది అన్నది.

25
భారత్–పాక్ మ్యాచ్ ఎందుకు అడ్వర్టైజర్లకు బంగారు గని

భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ పోరు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ల‌వ‌ర్స్ ఒక్కసారిగా టీవీ ముందు కూర్చోబెట్టే ఈవెంట్. ప్రతి సారి ఈ మ్యాచ్ టీఆర్పీ రికార్డులు బద్దలు కొడుతుంది. అందుకే బ్రాండ్లకు ఇది అత్యంత విలువైన అవకాశం. ఒకే మ్యాచ్ ద్వారా కోట్ల మంది ప్రేక్షకుల వరకు చేరే అరుదైన ఛాన్స్ ఇది.

35
10 సెకన్ల ప్రకటనకు ఎంత ఖర్చవుతుంది.?

భారత్–పాక్ మ్యాచ్ సమయంలో ప్రకటన రేట్లు అమాంతం పెరుగుతాయి. ఇటీవల జరిగిన టోర్నీల ఆధారంగా చూస్తే, ఒక 10 సెకన్ల టీవీ యాడ్ ధర రూ.14 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. టోర్నీ స్థాయి, మ్యాచ్ ప్రాముఖ్యత, ప్రసార వేదిక ఆధారంగా ఈ రేట్లు మారుతాయి. వరల్డ్ కప్ లాంటి పెద్ద ఈవెంట్లలో ఈ ధరలు గరిష్ట స్థాయికి చేరతాయి.

45
టోర్నీని బట్టి రేట్లు మారుతాయి

ఆసియా కప్ 2025 సమయంలో భారత్–పాక్ మ్యాచ్ ప్రకటనకు 10 సెకన్లకు సగటున రూ.14 నుంచి రూ.16 లక్షలు వసూలు చేశారు. ఐసీసీ నిర్వహించే పెద్ద టోర్నీల్లో ఈ రేట్లు మరింత పెరిగాయి. చాంపియన్స్ ట్రోఫీ 2025–26లో ఒక్కో 10 సెకన్ల ప్రకటనకు రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేశారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఈ రేట్లు రూ.35 నుంచి రూ.40 లక్షల వరకు వెళ్లాయి.

55
మ్యాచ్ రద్దయితే నష్టం ఎంత

ఒకవేళ భారత్–పాక్ మ్యాచ్ రద్దయితే నష్టం భారీగానే ఉంటుంది. బ్రాడ్‌కాస్టర్లకు మాత్రమే రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ప్రత్యక్ష నష్టం వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు స్పాన్సర్‌షిప్ ఒప్పందాలు, బ్రాండ్ కమిట్‌మెంట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ ఒక్క మ్యాచ్ చుట్టూ క్రికెట్ ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories