మ్యాచ్ ఐదవ రోజుకు చేరుకునే సమయానికి శ్రీలంక భారీ స్కోరు నమోదు చేసిన తర్వాత, ఇక మ్యాచ్ను డిక్లేర్ చేయడంతో చివరికి మ్యాచ్ డ్రా గా ముగసింది. ఈ ఇన్నింగ్స్తో జయసూర్య తన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.
టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఒకే విధంగా దూకుడైన ఆటతీరుతో రాణించిన సనత్ జయసూర్య, తక్కువ సమయానికే ఎక్కువ పరుగులు చేయడంలో దిట్ట. ఆయన క్రికెట్ స్టైల్ విరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్వెల్ లాంటి ఆటగాళ్లకు ప్రేరణగా నిలిచింది.
సనత్ జయసూర్య 340 పరుగుల ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్లోనే కాదు, మొత్తం క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ ఘనత ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. 56వ పుట్టినరోజున జయసూర్యకు ఈ ఇన్నింగ్స్ మరొక గౌరవ గుర్తుగా నిలిచింది.