కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా 2012, 2016లో తమ చివరి హోమ్ మ్యాచ్లు ఆడారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన మూడు వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ 58, 64, 35 పరుగులు చేయగా, కోహ్లీ వరుసగా 24, 14, 20 పరుగుల ఇన్నింగ్స్లు ఆడాడు. విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు కూడా దూరంగా ఉన్నాడు. జనవరి 2024లో దక్షిణాఫ్రికాతో తన చివరి టెస్టు ఆడాడు. అక్కడ 46, 12 పరుగులు చేశాడు.