విరాట్ తన అభిమాన ఐపీఎల్ ప్రత్యర్థిగా రోహిత్ శర్మ టీమ్ ముంబై ఇండియన్స్ ను ఎంచుకుంటారని భావించారు. ధోని టీమ్ సీఎస్కే ను కూడా కాదని చెబుతూ.. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ను తనకు ఇష్టమైన ప్రత్యర్థి జట్టుగా కింగ్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏప్రిల్ 18, 2008న ఆర్సీబీ-కేకేఆర్ మధ్య జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ లో విరాట్ భాగమయ్యాడు. సౌరవ్ గాగులీ నేతృత్వంలోని జట్టు మొత్తం 222 పరుగులు చేసింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 82 పరుగులకే ఆలౌట్ తో ఘోరంగా ఓడిపోయింది. విరాట్ 5 బంతుల్లో 1 పరుగులు చేసి ఔటయ్యాడు.