ప్రస్తుతం బీసీసీఐ లేదా టీమ్ మేనేజ్మెంట్ నుండి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఈ ఎంపిక వన్డే ఫార్మాట్లో మార్పులకు సూచనగా భావిస్తున్నారు. రోహిత్ గతంలో భారత జట్టును విజయాల దిశగా నడిపించినప్పటికీ, ఇప్పుడు గిల్ను నూతన నాయకుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. దీంతో రోహిత్, కోహ్లీల వన్డే కెరీర్ కు రాబోయే సిరీస్ లలో శుభం కార్డు పడనుందనే చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే బీసీసీఐ ఈ సీనియర్ స్టార్ ప్లేయర్లను ప్రపంచ కప్ జట్టులో భాగంగా చూడటం లేదనీ, దీనిని కెప్టెన్సీ మార్పులతో స్పష్టం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, శుబ్మన్ గిల్కు ఇది ఒక కీలక అవకాశం. కానీ, సీనియర్ ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ, యువ జట్టును ముందుకు నడిపించడం అతనికి పెద్ద సవాలు కానుంది. రోహిత్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండి మద్దతు ఇస్తే, ఈ మార్పు సాఫీగా సాగుతుందనే అభిప్రాయం క్రికెట్ వర్గాల్లో ఉంది.