విరాట్ కోహ్లి బ్యాటింగ్ను చూసేందుకు గంటల తరబడి నిరీక్షించిన చాలా మంది అభిమానులు, అతను ఔటైన వెంటనే స్టేడియం నుంచి బయటకు వెళ్లడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కాగా, BCCI సెలెక్టర్లు, టీం ఇండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ సూచనల మేరకు విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీకి తిరిగి వచ్చాడు. ఆసీస్ తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఆశించినస్థాయిలో రాణించలేకపోయాడు. అక్కడ ఒక సెంచరీతో సహా కేవలం 190 పరుగులు చేశాడు. 9 ఇన్నింగ్స్ల్లో కోహ్లీ సగటు 23.75.