ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. "మిని ప్రపంచ కప్" అని గుర్తింపు పొందిన ఈ టోర్నీకి ప్రారంభానికి ముందే పాకిస్తాన్ కు షాక్ తగిలింది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్లో జరగనుంది. ఇది ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. అయితే, భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడానికి నో చెప్పడంతో పాకిస్తాన్ తో పాటు దుబాయ్లలో మ్యాచ్ లను నిర్వహించడానికి ఐసీసీ ప్లాన్ చేసింది.
దీంతో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగుతాయని ఐసీసీ ప్రకటించింది. ఐసీసీ నిర్వహించే ప్రతి పెద్ద టోర్నమెంట్లోనూ కెప్టెన్ల సమావేశం, ఫోటోషూట్ జరగడం ఆనవాయితీ. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తున్నందున, ఆ దేశంలో ఈ టోర్నమెంట్లో పాల్గొనే జట్ల కెప్టెన్ల సమావేశం, ఫోటోషూట్ జరగాల్సి ఉంది.
25
ఛాంపియన్స్ ట్రోఫీ 2025
భారత్ కు అనుకూలంగా ఐసీసీ నిర్ణయం
కానీ కెప్టెన్ల సమావేశం కోసం రోహిత్ శర్మను పాకిస్తాన్కు పంపలేమని భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఐసీసీకి తేల్చి చెప్పింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, "భారత్ చేస్తున్నది సరికాదు; క్రికెట్లో రాజకీయాలు కలుపకూడదు. దీని ద్వారా బీసీసీఐ ఐసీసీ నిబంధనలను ఉల్లంఘించింది" అని ఆరోపించింది.
ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అధికారిక కెప్టెన్ల సమావేశం, ఫోటోషూట్ ఉండవని, వీటిని రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ఇప్పుడు సంచలన ప్రకటన చేసింది. అంటే, మొత్తం కెప్టెన్ల సమావేశం రద్దు చేశారు.ఇది భారత్ కు అనుకూలమైన నిర్ణయం.
35
ఐసీసీ తీరుపై పాకిస్తాన్ ఆగ్రహం
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ల సమావేశం జరగడం ఆనవాయితీగా ఉండగా, ఈసారి ఈ కార్యక్రమాన్నే ఐసీసీ రద్దు చేయడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చింది. బీసీసీఐకి అనుకూలంగా ఐసీసీ ఇలా నిబంధనను మార్చడం సరికాదని పాకిస్తాన్ క్రికెట్ మాజీ ఆటగాళ్ళు, ఆ దేశ అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
1996 తర్వాత ఐసీసీ పెద్ద టోర్నమెంట్ (ఛాంపియన్స్ ట్రోఫీ) నిర్వహించే అవకాశం పాకిస్తాన్కు లభించింది. ఈ టోర్నమెంట్ ద్వారా భారీ ఆదాయం వస్తుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆశించింది. కానీ భారత జట్టు పాకిస్తాన్ వెళ్లదని బీసీసీఐ పాకిస్తాన్ కలలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు కెప్టెన్ల సమావేశం కూడా రద్దు కావడంతో పాకిస్తాన్ నిరాశలో ఉంది.
45
బీసీసీఐ-ఐసీసీ
జెర్సీలో లోగో కూడా వివాదాస్పదం అయ్యింది
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు జెర్సీపై పాకిస్తాన్ పేరు ముద్రించడానికి బీసీసీఐ నిరాకరించినట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. టోర్నమెంట్ నిర్వహించే దేశం పేరు అన్ని దేశాల జెర్సీలపై ఉండటం ఆనవాయితీ అయినప్పటికీ, బీసీసీఐ దీనికి నిరాకరించినట్లు వార్తలు వ్యాపించాయి.
కానీ దీనిని ఖండిస్తూ, ఐసీసీ నిబంధనలను మేము అంగీకరిస్తామనీ, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇతర జట్లు పాటించే నిబంధనలనే మేము కూడా పాటిస్తామని బీసీసీఐ వివరణ ఇచ్చింది.
55
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: భారత్ - పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. బద్ధ-ప్రత్యర్థుల మధ్య ఇటీవలి కొన్ని పోటీలలో, రెండు శిబిరాల నుండి ఆటగాళ్ళు మ్యాచ్కు ముందు, పోటీ సమయంలో కూడా ఆనందాన్ని పంచుకోవడం మనం తరచుగా చూశాము.
అయితే, భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లో అంటే క్రికెట్ ప్రపంచంలోనే కాదు క్రీడాలోకంలో కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇరు దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఈ మ్యాచ్ ల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తాయి.