ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్కి చెందిన ముగ్గురు ప్లేయర్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈసారి వేలంలో విగ్నేష్ పుతుర్, సత్యనారాయణ రాజు, రాబిన్ మింజ్ అనే ముగ్గురు ప్లేయర్స్ని ముంబై ఇండియన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తీసుకోవడమే కాదు తొలి మ్యాచ్లోనే వీరికి స్థానం కల్పించారు.
దీంతో యంగ్ ట్యాలెంట్ను ప్రమోట్ చేయడానికి ముంబై ఇండియన్స్ పెద్ద పీట వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ఈ ముగ్గురు ప్లేయర్స్ కుటుంబ నేపథ్యంలో. పేద కుటుంబంలో జన్మించిన వీరు ఇప్పుడు ఐపీఎల్లో తళుక్కుమనే స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ప్లేయర్స్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసుకుందాం..