DC vs RR Indian Premier League 2025
DC vs RR Indian Premier League 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 లో మరో ఉత్కంఠ పోరుకు డిల్లీ స్టేడియం వేదికయ్యింది. రెండు టీంలు సమాన స్కోరు 188 పరుగులే సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది... దీంతో ఈ సీజన్లో మొదటిసారి సూపర్ ఓవర్ జరిగింది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 11 పరుగులు చేసింది. డిల్లీ కేవలం బంతుల్లోనే పని కానిచ్చేసారు... మరో రెండు బంతులు మిగిలుండగానే 13 పరుగులు బాదారు. సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన కెఎల్ రాహుల్ 3 బంతుల్లో 7 పరుగులు, స్టబ్స్ ఒకే బంతిని ఎదుర్కొని సిక్స్ బాదాడు. దీంతో డిల్లీని విజయం వరించింది.
ముందుగా రాజస్థాన్ రాయల్స్ సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేయగా మిచెల్ స్టార్క్ మిస్సైల్ లాంటి బంతులతో మ్యాజిక్ చేసాడు. అతడు వరుసగా రెండు బంతుల్లో ఇద్దరు బ్యాట్స్ మెన్స్ రనౌట్ చేసాడు. ఇలా పరాగ్, హెట్మెయర్ రనౌట్ కావడంతో మరో బంతి మిగిలుండగానే రాజస్థాన్ సూపర్ ఓవర్ ను ముగించింది. స్టార్క్ బౌలింగ్ ను ఎదుర్కోలేక రాజస్థాన్ టీం కేవలం 11 పరుగులు మాత్రమే చేసింది.
DC vs RR
డిల్లీ ఇన్నింగ్స్ సాగిందిలా :
సొంత మైదానంలో ఆడుతున్న డిల్లీకి మంచి ఆరంభం లభించింది. యువ ఓపెనర్ అభిషేక్ పొరేల్ రెండో ఓవర్లో విధ్వంసం చేసాడు... 4,4,6,4,4,1 తో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో రాజస్థాన్ బ్యాటింగ్ కాస్త స్లో అయ్యింది. అభిషేక్ కేవలం 37 బంతుల్లో 49 పరుగులు చేసాడు.
గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన కరణ్ నాయర్ డకౌట్ అయ్యాడు... అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మెక్ గర్క్ కూడా కేవలం 9 పరుగులే చేసాడు. ఇక రాహుల్ 32 బంతుల్లో 38 పరుగులతో సందర్భోచితంగా ఆడాడు. చివర్లో స్టబ్స్ 18 బంతుల్లో 34 పరుగులు రాణించాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు... కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు.
మొత్తంగా డిల్లీ బ్యాటింగ్ ఆరంభం, ఫినిషింగ్ అదిరింది. మొదట్లో ఓపెనర్ పొరేల్.. చివర్లో అక్షర్, స్టబ్స్ పరుగులు రాబట్టారు. దీంతో డిల్లీ సొంత మైదానంలో మంచి స్కోరు సాధించింది. నిర్ఱీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
DC vs RR
రాజస్థాన్ బ్యాటింగ్ సాగిందిలా :
189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ టీం కు ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇచ్చారు. యశస్వి జైస్వార్ కేవలం 37 బంతుల్లో 51 పరుగులు (3 ఫోర్లు, 4 సిక్సర్లు), సంజు శాంసన్ 19 బంతుల్లో 31 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టారు. ఓపెనర్లిద్దరు అద్బుతంగా ఆడుతున్న సమయంలో శాంసన్ గాయంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
ఇక చివర్లో నితీష్ రానా, ద్రువ్ జురేల్ మెరుపులు మెరిపించారు. నితీష్ కేవలం 28 బంతుల్లో 51 పరుగులు (6 ఫోర్లు, 2 సిక్సర్లు), జురేల్ 17 బంతుల్లో 26 పరుగులు (2 సిక్సర్లు) చేసారు. చివర్లో హెట్మెయర్ 9 బంతుల్లో 15 పరుగులు చేసాడు.
అయితే చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు చేయాల్సి ఉండగా డిల్లీ బౌలర్ మ్యాజిక్ చేసాడు. యార్కర్ బంతులతో విరుచుకుపడి రాజస్థాన్ హిట్టర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో రాజస్థాన్ కూడా 188 పరుగులు మాత్రమే చేయగలిగింది.., ఇలా మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. ఈ సూపర్ ఓవర్లోనూ స్టార్ మాయ కొనసాగింది.