ఆరంభంలో వికెట్లు.. ఆ తర్వాత
56 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు కూడా ఆరంభంలో అనుకున్నంత సులువుగా పరిస్థితులు సాగలేదు. ఓపెనర్ షెఫాలీ వర్మ 12 పరుగులు చేసి ఔటవగా, స్మృతి మంధాన 9 పరుగులకే వెనుదిరిగింది. అనంతరం వన్డౌన్లో వచ్చిన ప్రతీకా రావల్ కూడా 4 పరుగులకే పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 35 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. అయితే లక్ష్యం చాలా తక్కువగా ఉండటంతో భారత జట్టుపై ఎలాంటి ఒత్తిడి కనిపించలేదు.
హర్మన్ప్రీత్, దీప్తి శర్మతో విజయ ముద్ర
మూడో వికెట్ తర్వాత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇద్దరూ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. హర్మన్ప్రీత్ 18 పరుగులతో, దీప్తి శర్మ 12 పరుగులతో నాటౌట్గా నిలిచారు. బౌండరీలు బాదుతూ స్కోరును వేగంగా పెంచిన ఈ జోడీ 8.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని మహిళల ఆసియా కప్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. బౌలింగ్లో పాక్ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడం, బ్యాటింగ్లో స్వల్ప లక్ష్యాన్ని వేగంగా ఛేదించడం ద్వారా టీమిండియా అన్ని విభాగాల్లోనూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.