ఈ మ్యాచ్ ను సుమారు లక్షా యాభై వేల మంది వీక్షిస్తారని తాను అనుకుంటున్నానని అక్తర్ అన్నాడు. వారితో పాటుగా తానూ ప్రేక్షకుల మధ్యే మ్యాచ్ ను వీక్షిస్తానని చెప్పుకొచ్చాడు. ‘ఈ మ్యాచ్ ను 1,50,000 మంది చూస్తారని నేను అనుకుంటున్నా. వారిలో 70వేల మంది భారతీయ అభిమానులే ఉంటారు. వారితో కలిసి నేను మ్యాచ్ చూస్తా..’ అని అక్తర్ వివరించాడు.