India vs England: మూడో వన్డేలోనూ విజయం సాధించి ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేసింది భారత జట్టు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటర్లు దుమ్మురేపే బ్యాటింగ్ తో భారీ స్కోర్ చేయగా, ఆ తర్వాత భారత బౌలర్లు ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్నారు.
India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టి 142 పరుగుల తేడాతో విజయం సాధించింది.
దీంతో ఇంగ్లాండ్ జట్టును వైట్ వాష్ చేస్తూ సిరీస్ను 3-0 తేడాతో భారత జట్టు గెలుచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. భారత్ భారత్ అద్భుతమైన బ్యాటింగ్ తో 50 ఓవర్లలో ఇంగ్లాండ్ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.
25
అర్షదీప్ ఇంగ్లాండ్ పతనాన్ని మొదలు పెట్టాడు
357 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ను భారత బౌలర్లు చెడుగుడు ఆడుకున్నారు. ఆరంభం నుంచే ఇంగ్లాండ్ పై పట్టు సాధించి పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.
ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించింది. 11 ఓవర్లలో 2 వికెట్లకు 89 పరుగులు చేసింది. బెన్ డకెట్ దూకుడుగా ఆటను ప్రారంభించాడు కానీ, పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతను 22 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన ఒక ఓవర్లో డకెట్ వరుసగా 4 ఫోర్లు కొట్టాడు. డకెట్ తన ఇన్నింగ్స్లో 8 ఫోర్లు కొట్టాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ అతన్ని క్యాచ్గా తీసుకున్నాడు. డకెట్ తర్వాత, ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. సాల్ట్ 4 ఫోర్లు కొట్టి అర్ష్దీప్ బౌలింగ్లో అక్షర్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
35
కుల్దీప్ యాదవ్, అక్షర్ దెబ్బకు ఇంగ్లాండ్ కుదేలు
కుల్దీప్ యాదవ్ భారత్ కు మూడో వికెట్ అందించాడు. అతను టామ్ బాంటన్, జో రూట్ భాగస్వామ్యాన్ని కట్ చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్కు 46 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కుల్దీప్ బాంటన్ ను కేఎల్ రాహుల్ క్యాచ్ తో అందుకున్నాడు. బాంటన్ 41 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
ఆ తర్వాత లెజెండరీ బ్యాట్స్మన్ జో రూట్ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. రూట్ 29 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. 22 ఓవర్లలో 4 వికెట్లకు 139 పరుగులు చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత కూడా భారత బౌలింగ్ ముందు నిలవలేకపోయింది.
45
Image Credit: Getty Images
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా శుభ్ మన్ గిల్
ఆ తర్వాత హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ లు రాణించడంతో ఇంగ్లాండ్ కష్టాలు మరింత పెరిగాయి. ఇంగ్లాండ్ స్కోరు 31 ఓవర్లలో 8 వికెట్లకు 179 పరుగులు చేసింది. మొత్తంగా బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలా 2 వికెట్లు తీసుకోవడంతో ఇంగ్లాండ్ జట్టు 214 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ పై ఇండియా 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తో పాటు సిరీస్ మొత్తంగా పరుగుల వరద పారించిన భారత వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు.
55
2011 తర్వాత క్లీన్ స్వీప్ చేసిన భారత్
2011 నుండి ఇంగ్లాండ్తో జరిగిన 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్లో భారతదేశం అన్ని మ్యాచ్లను గెలుచుకుంది. చివరిసారిగా 2011-12లో ఇండియా సొంత మైదానంలో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ను 5-0 తేడాతో ఓడించింది. 1984 తర్వాత సొంతగడ్డపై ఇంగ్లాండ్తో జరిగిన ఒక్క వన్డే సిరీస్ను కూడా టీమ్ ఇండియా కోల్పోలేదు.