Champions Trophy: పాకిస్తాన్‌ను ఓడించడానికి భారత్ రెడీ !

Published : Feb 23, 2025, 09:46 AM ISTUpdated : Feb 23, 2025, 01:09 PM IST

India vs Pakistan Champions Trophy Clash:  ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్లు ఆదివారం దుబాయ్ స్టేడియంలో తలపడనున్నాయి. భారత జట్టులో రెండు మార్పులు చేసినట్లు సమాచారం.

PREV
14
Champions Trophy: పాకిస్తాన్‌ను ఓడించడానికి భారత్ రెడీ !

India vs Pakistan Champions Trophy Clash: ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్, దుబాయ్‌లో ఆదివారం జరుగుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు పూర్తి అయిపోయాయి. ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఇవాళ దుబాయ్‌లో జరగనుంది. ఇండియా తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇవాళ తన రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. 

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఇవాళ గెలిస్తే ఇండియా సెమీఫైనల్స్‌కు వెళ్తుంది. పాకిస్తాన్‌కు ఇది చావో రేవో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సిరీస్ నుంచి బయటకు వెళ్లాల్సిందే.

24
ఛాంపియన్స్ ట్రోఫీ 2025

భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలంగా ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తప్ప మిగతా ప్లేయర్లు బాగా ఆడారు. రోహిత్ శర్మ మంచి ఆరంభం ఇచ్చాడు. సూపర్ సెంచరీ కొట్టిన గిల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తాడని ఆశిద్దాం. కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు.

బౌలింగ్‌లో అనుభవమున్న మహమ్మద్ షమీ బంగ్లాదేశ్‌పై 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టులో 2 మార్పులు ఉండొచ్చు. బంగ్లాదేశ్‌పై వికెట్ తీయని కుల్దీప్ యాదవ్ స్థానంలో తమిళనాడు ప్లేయర్ వరుణ్ చక్రవర్తి జట్టులోకి రావచ్చు. 

34
భారత్-పాకిస్తాన్ మ్యాచ్

అలాగే ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు బదులుగా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వస్తాడని సమాచారం. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత తుది జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ ఉంటారని సమాచారం.

మరోవైపు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌ చేతిలో తొలి మ్యాచ్ లో ఓడిపోయింది కాబట్టి ఇండియాపై గెలవాల్సిన పరిస్థితి. ఆ జట్టులో బాబర్ ఆజమ్ తప్ప ఎవరూ ఫామ్‌లో లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మళ్లీ ఫామ్‌లోకి రావాలి. గాయం వల్ల సిరీస్ నుంచి తప్పుకున్న ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కు పాక్ చావో రేవో మ్యాచ్. 

44
పాకిస్తాన్ జట్టు

పాకిస్తాన్ బలం బౌలింగ్. కానీ మొదటి మ్యాచ్‌లో షాహీన్ షా అఫ్రిది, హరీస్ రాఫ్, నసీమ్ షా ఎక్కువ పరుగులు ఇచ్చారు. ఇవాళ పాకిస్తాన్ గెలవాలంటే వీళ్లు బాగా ఆడాలి. పాకిస్తాన్ తుది జట్టులో మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజమ్, సౌత్ షకీల్, సల్మాన్ ఆగా, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులాం ఉంటారని సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories