అలాగే ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు బదులుగా లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ వస్తాడని సమాచారం. పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో భారత తుది జట్టులో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ ఉంటారని సమాచారం.
మరోవైపు పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో తొలి మ్యాచ్ లో ఓడిపోయింది కాబట్టి ఇండియాపై గెలవాల్సిన పరిస్థితి. ఆ జట్టులో బాబర్ ఆజమ్ తప్ప ఎవరూ ఫామ్లో లేకపోవడం పెద్ద సమస్యగా ఉంది. కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మళ్లీ ఫామ్లోకి రావాలి. గాయం వల్ల సిరీస్ నుంచి తప్పుకున్న ఫకర్ జమాన్ స్థానంలో ఇమామ్ ఉల్ హక్ జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్ కు పాక్ చావో రేవో మ్యాచ్.