కాగా, భారత్, పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ ఫిబ్రవరి 23, 2025న మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 టీమ్ లు ఆడుతున్నాయి. భారత్ తన మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై గెలిచింది. పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడింది. కానీ ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. దీంతో భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే టోర్నీలో ఉంటుంది. లేకుంటే ఇంటిదారి పడుతుంది. ఇక టీమిండియా పాక్ పై గెలిస్తే సెమీస్ చేరుతుంది.