భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ లలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలు చాలానే ఉన్నాయి?
2010, దంబుల్లా - హర్భజన్ సింగ్ సిక్సర్ తో భారత్ గెలుపు
ఆఖరి ఓవర్లో 7 పరుగులు కావాల్సిన సందర్భంలో హర్భజన్ సింగ్ మొహమ్మద్ ఆమిర్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టి భారత్కు ఉత్కంఠభరిత విజయాన్ని అందించాడు.
2014, మిర్పూర్ - ఆఫ్రిదీ మ్యాజిక్
ఆఖరి ఓవర్లో 9 పరుగులు కావాల్సిన సమయంలో షాహిద్ ఆఫ్రిదీ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్స్లు కొట్టి పాకిస్తాన్కు విజయాన్ని అందించాడు.
2016, మిర్పూర్ - కోహ్లీ vs ఆమిర్
టీ20 ఆసియా కప్ తొలి ఎడిషన్లో పాకిస్తాన్ 83 పరుగులకే ఆలౌటైంది. భారత్ ఛేజ్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ విరాట్ కోహ్లీ 49 పరుగులు చేసి జట్టును 5 వికెట్ల తేడాతో గెలిపించాడు.
2023, కొలంబో – భారత్ థ్రిల్లింగ్ విక్టరీ
భారత్ 356/2 స్కోరు చేయగా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అజేయ సెంచరీలతో అదరగొట్టారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో 5 వికెట్లు తీసి భారత్ కు 228 పరుగుల విజయాన్ని అందించారు.