టీమిండియాతో న్యూజిలాండ్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్న విషయం తెలిసిందే. నేడు జైపూర్ వేదికగా తొలి టీ20 జరుగనుండగా..19 న రాంచీలో రెండో టీ20, చివరిదైన మూడో టీ20 ఈనెల 21న ఈడెన్ గార్డెన్ లో జరుగనుంది. తొలి టెస్టు నవంబర్ 25-29 మధ్య కాన్పూర్ లో.. రెండో టెస్టు డిసెంబర్ 3-7 దాకా ముంబైలో నిర్వహించనున్నారు.