IND vs AFG: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ టీ20లో యశస్వి జైస్వాల్ ఎందుకు ఆడ‌టం లేదంటే..?

Published : Jan 11, 2024, 08:11 PM IST

India vs  Afghanistan T20 Series: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ మ‌ధ్య మొహాలీ వేదిక‌గా తొలి టీ20 మ్యాచ్ భార‌త టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే, రోహిత్ తో క‌లిసి ఓపెన‌ర్ గా బ‌రిలోకి దిగుతాడ‌నుకున్న య‌శ‌స్వి జైస్వాల్ కు తుదిజ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. దీనిపై బీసీసీ క్లారిటీ ఇచ్చింది.   

PREV
16
IND vs AFG: భార‌త్-ఆఫ్ఘనిస్థాన్ టీ20లో యశస్వి జైస్వాల్ ఎందుకు ఆడ‌టం లేదంటే..?
Yashasvi Jaiswal

IND vs AFG 1st T20I: మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భార‌త్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే, భార‌త యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ కు తుది జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. కోచ్ రాహుల్ ద్రావిడ్ నుంచి మొద‌లు క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి మద్దతు పొందిన యశస్వి జైస్వాల్ మొహాలీలో అఫ్గానిస్థాన్ తో జరిగే తొలి మ్యాచ్లో ఆడటం లేదు. జైస్వాల్  ఎందుకు ఆడ‌టం లేదో బీసీసీ, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు వివ‌రించారు.

26
Yashasvi Jaiswal

దక్షిణాఫ్రికా పర్యటనలో విజయవంతమైన బహుళ ఫార్మాట్ సిరీస్ తర్వాత, మెన్ ఇన్ బ్లూ ఆతిథ్య ఆఫ్ఘనిస్తాన్ కు మూడు మ్యాచ్ ల‌ టీ20 సిరీస్ కు ఆతిథ్యం ఇస్తోంది. పంజాబ్ లోని మొహాలీలోని ఐఎస్ బింద్రా క్రికెట్ స్టేడియంలో ఈ సిరీస్ ప్రారంభమైంది. మ్యాచ్ కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడుతూ భారత కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తో కలిసి ఓపెనింగ్ చేస్తాడ‌ని చెప్పాడు. 

36
Yashasvi Jaiswal

అయితే 22 ఏళ్ల యువ ఆటగాడు స‌రిగా ఆడలేని ప‌రిస్థితిలో ఉన్నాడ‌నీ, అందుకే తుదిజ‌ట్టులోకి తీసుకోలేదని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. అలాగే, కుడి గజ్జ నొప్పి కారణంగా జైస్వాల్ ను జట్టులోకి తీసుకోలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. కుడి గజ్జ నొప్పి కారణంగా యశస్వి జైస్వాల్ తొలి టీ20కి అందుబాటులో లేడని బీసీసీఐ ట్వీట్ చేసింది.

46

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా ఆఫ్ఘ‌న్ ను బ్యాటింగ్  కు ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. 'ఈ మూడు మ్యాచ్ ల ద్వారా ఎంతో ప్రయోజనం పొందాల్సి ఉంది.. ప్రపంచ కప్ కు ముందు ఈ సీరిస్ కీల‌కం. ఎందుకంటే భార‌త్ కు టీ20 మ్యాచ్ లు ఆడే అవ‌కాశం లేదు. ఐపీఎల్ ఉంది, కానీ ఇది అంతర్జాతీయ మ్యాచ్, మేము కొన్ని విషయాలను సాధించడానికి ప్రయత్నిస్తాము. ఈ కాంబినేషన్ ఎలా ముందుకు వెళ్తుందో, గ్రూప్ గా ఏం చేయాలో రాహుల్ భాయ్ తో మాట్లాడాను. మేం అదే చేయడానికి ప్రయత్నిస్తాం, గెలుపే ముఖ్యం' అని అన్నాడు.

56
Yashasvi Jaiswal

ఐపీఎల్ చివరి రెండు ఎడిషన్లలో ఆకట్టుకుని 2023లో భారత జట్టులోకి అడుగుపెట్టిన య‌శ‌స్వి జైస్వాల్ ఇప్పటివరకు తనకు వచ్చిన అన్ని అవకాశాల్లో స‌ద్వినియోగం చేసుకున్నాడు. 15 మ్యాచ్ లు ఆడిన జైస్వాల్ టీ20ల్లో 33.07 సగటుతో 159.25 స్ట్రైక్ రేట్ తో 430 పరుగులు చేశాడు.

66

అయితే, మ్యాచ్ రోజు జైస్వాల్ గాయపడటంతో తొలి మ్యాచ్ కు దూరమవడంతో అతని స్థానంలో శుబ్ మన్ గిల్ కు తుది జట్టులోకి తీసుకున్నారు. జైస్వాల్ సరిగా ఆడలేని స్థితిలో ఉన్నాడ‌ని రోహిత్ శర్మ చెప్ప‌గా, కుడి గజ్జ నొప్పి కారణంగా జైస్వాల్ ఎంపికకు అందుబాటులో లేడని బీసీసీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories