తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పెర్త్ లో పరుగుల వరద పారించారు. సెంచరీల మోత మోగించారు. టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ రెండో ఇన్నింగ్స్లో సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. 161 పరుగులు చేశారు. తన ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.
అతనికి తోడుగా మరో ఓపెనర్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేెఎల్ రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ 77 పరుగుల తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు బాదాడు. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత వరుసగా భారత వికెట్లు పడుతుంటే మరో ఎండ్ నిలదొక్కుకున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ చాలా కాలం తర్వాత సెంచరీ సాధించి అభిమానులను ఉత్సాహపరిచాడు. 100* పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. భారత్ 487 పరుగులకు రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.