IND vs SL: శ్రీలంక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు గౌతమ్ గంభీర్ బిగ్ వార్నింగ్

Published : Aug 07, 2026, 11:21 AM IST

India vs Sri Lanka : శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా ‘సిద్ధంగా ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్లేయర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

PREV
15
WTC ఫైనల్ రేస్.. లంకను కొట్టడానికి గంభీర్ పక్కా మాస్టర్ ప్లాన్ ఉందా?

శ్రీలంకతో జరగబోయే అత్యంత కీలకమైన రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ జట్టు సభ్యులకు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. టీమిండియా నుంచి తాను ఎలాంటి అంకితభావం, కష్టపడే తత్వాన్ని ఆశిస్తున్నానో గంభీర్ స్పష్టంగా వివరించారు. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ప్రతీ సవాలును ఎదుర్కొనేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

25
సవాలు ఏదైనా సరే.. సమాధానం సిద్ధంగా ఉండాలి

శ్రీలంకతో మ్యాచ్ కు ముందు ఆటగాళ్లను ఉద్దేశించి బీసీసీఐ (BCCI) విడుదల చేసిన వీడియోలో గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "మన ముందు ఏముందో, మనం దేనికోసం ఆడుతున్నామో మనందరికీ బాగా తెలుసు. మనం శ్రమించే సమయం పెంచుకోవచ్చు, మన హద్దులను దాటి కష్టపడవచ్చు. అన్ని విషయాల్లో పక్కాగా సిద్ధం కావచ్చు. ఆగస్టు 15న ఉదయం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి, మనం మొదట బ్యాటింగ్ చేసినా లేదా బౌలింగ్ చేసినా సరే.. మనపై విసిరే ప్రతీ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడానికి మనం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలి" అని గంభీర్ జట్టుకు దిశానిర్దేశం చేశారు.

35
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేస్ అండ్ ప్రిపరేషన్స్

గతేడాది చివర్లో సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 0-2తో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్‌లో భారత్‌కు ఇది మొదటి ప్రధాన అసైన్‌మెంట్. జూన్‌లో అఫ్గానిస్థాన్‌పై సాధించిన గెలుపుతో పుంజుకున్నప్పటికీ, ద ఓవల్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలను మెరుగుపరుచుకోవాలంటే శ్రీలంకపై సిరీస్ విజయం భారత్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 48.15 శాతంతో 5వ స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతంతో 6వ స్థానంలో ఉంది. కొలంబోలోని ఎన్‌సీసీ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన భారత్, మొదటి టెస్టుకు ముందు శ్రీలంక 11తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.

45
కొత్త ఆటగాళ్లకు ఘన స్వాగతం

గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌కు దూరం కావడంతో, రంజీ ట్రోఫీలో జమ్మూ కాశ్మీర్‌ను విజేతగా నిలిపి 60 వికెట్లు తీసిన యువ పేసర్ ఆకిబ్ నబీకి తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. అలాగే మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా మెరిసిన 33 ఏళ్ల సారాంశ్ జైన్ కూడా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన నబీ, జైన్ లకు గంభీర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. "మీరు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డారు. అవకాశం వచ్చినప్పుడు మీ కుటుంబం, దేశం గర్వపడేలా ఆడండి" అని గంభీర్ అన్నారు. కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్‌ను కూడా గంభీర్ జట్టులోకి ఆహ్వానించారు.

55
గాయాల సమస్యలు.. స్పిన్ ప్రాక్టీస్

ఈ సిరీస్ ఆడబోయే ప్రస్తుత భారత జట్టులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లకు మాత్రమే శ్రీలంకలో టెస్టులు ఆడిన అనుభవం ఉంది. శ్రీలంకలోని స్పిన్ పిచ్‌లను ఎదుర్కొనేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రాహుల్, జైస్వాల్ ఇప్పటికే ప్రత్యేక ప్రాక్టీస్ మొదలుపెట్టారు. టీమిండియా ప్రాక్టీస్ కోసం హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, తనుష్ కొటియాన్, విప్రాజ్ నిగమ్‌లను నెట్ బౌలర్లుగా తీసుకెళ్లింది. కాగా బుమ్రాతో పాటు హంబ్‌స్ట్రింగ్ గాయంతో వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్టుకు దూరం కాగా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ కూడా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు.

సిరీస్ షెడ్యూల్

• మొదటి టెస్ట్: ఆగస్టు 15 - 19 (గాలే)

• రెండో టెస్ట్: ఆగస్టు 23 - 27 (కొలంబో)

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, సాయి సుదర్శన్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారంచ్ జైన్, ఆకిబ్ నబీ.

Read more Photos on
click me!

Recommended Stories