India vs Sri Lanka: భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టులో సంచలన మార్పులు !

Published : Aug 13, 2026, 03:56 PM IST

India vs Sri Lanka: శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత్ బరిలోకి దిగుతోంది. తుది జట్టులో మార్పులు చాలానే ఉంటాయని క్రికెట్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. కొత్త ప్లేయర్లు కూడా అరంగేట్రం చేసే అవకాశముంది.

PREV
16
భారత్ vs శ్రీలంక: గాలె టెస్ట్‌లో భారత్ సంచలన నిర్ణయాలు

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య శనివారం నుంచి గాలెలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, యంగ్‌స్టర్స్‌తో కూడిన టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో గాలె టెస్ట్ కోసం భారత్ అంచనా తుది జట్టు ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం.

26
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి జోడీగా రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. యశస్వికి ఇది తొలి శ్రీలంక పర్యటన కావడం విశేషం.

36
మిడిలార్డర్‌లో పడిక్కల్, గిల్, పంత్

గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దేవదత్ పడిక్కల్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కొలంబోలో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ 142 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా ఇది తొలి శ్రీలంక టూర్. గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తన 3000 పరుగులను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్సీ కోల్పోయిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, తన బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

46
వికెట్ కీపర్ ధృవ్ జురెల్, ఆల్రౌండర్లు

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనబెట్టి రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను నంబర్ 6 స్థానంలో కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కి విశ్రాంతి తీసుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి తుది జట్టులోకి వస్తున్నాడు. అతనికి తోడుగా గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ రెండో స్పిన్-బౌలింగ్ ఆల్రౌండర్‌గా ఆడనున్నాడు. సుతార్ అఫ్గానిస్తాన్‌పై తన అరంగేట్రం మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

56
స్పిన్ విభాగం, గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం

లక్నో సూపర్‌జెయింట్స్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరిస్తాడు. ఇక బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకపై ఇండియా 'ఎ' తరఫున ఆడిన బ్రార్, తన ప్రతిభతో ఆకట్టుకుని సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

66
శ్రీలంకతో తొలి టెస్ట్‌కు భారత్ అంచనా తుది జట్టు

కెరీర్‌లో ఇప్పటివరకు 46 టెస్టుల్లో 140 వికెట్లు తీసిన గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ భారత్ బౌలింగ్ విభాగాన్ని ముందండి నడిపించనున్నాడు.

భారత తుది జట్టు

1. కేఎల్ రాహుల్

2. యశస్వి జైస్వాల్

3. దేవదత్ పడిక్కల్

4. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)

5. రిషబ్ పంత్

6. ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)

7. రవీంద్ర జడేజా

8. మానవ్ సుతార్

9. కుల్దీప్ యాదవ్

10. గుర్నూర్ బ్రార్

11. మహమ్మద్ సిరాజ్

Read more Photos on
click me!

Recommended Stories