ఇది కేవలం క్రికెట్ సమస్య మాత్రమే కాదు..
అలాగే, 'అన్నింటికంటే, ఇది క్రికెట్ సమస్య మాత్రమే కాదు.. సమస్య అంతకు మించి ఉంటుంది. ఒక క్రికెటర్గా, మీరు క్రికెట్ ఆడాలనుకుంటే ఆడండి అని నేను చెప్పగలను, అయితే భద్రత గురించి ఎల్లప్పుడూ ఆందోళన ఉంటుంది. భద్రతకు హామీ ఇవ్వకపోతే ఆటగాళ్ళు అక్కడికి వెళ్లకూడదు. ఇది మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతుంది' అని హర్భజన్ అన్నాడు.
అలాగే, హైబ్రిడ్ మోడల్పై చర్చలు జరిగే అవకాశాలను ప్రస్తావించారు. 'ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. భారత్ పాకిస్థాన్లో పర్యటించకుంటే ఐసీసీ ఇప్పటికే ప్లాన్ 'బీ' ని సిద్ధం చేసిందని పలు మీడియా నివేదికల్లో పేర్కొంది.
పాకిస్థాన్లో కాకుండా ఇతర వేదికల్లో మ్యాచ్ల నిర్వహణకు అయ్యే ఖర్చుల కోసం దాదాపు 65 మిలియన్ డాలర్ల బడ్జెట్ను ఐసీసీ ఆమోదించినట్లు నివేదికలు తెలిపాయి. గత ఏడాది పాకిస్థాన్లో జరిగిన ఆసియా కప్లో కూడా భారత జట్టు పాక్ వెళ్లలేదు. భారత్ ఆడిన అన్ని మ్యాచ్ లు శ్రీలంకలో జరిగాయి.