రెండో ఇన్నింగ్స్ లో సచిన్ పరుగు తీస్తుండగా అక్తర్ కావాలనే సచిన్ ను ఢీకొట్టాడని ఆరోపణలున్నాయి. అయితే ఈ క్రమంలో సచిన్ రనౌట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ దీనిని అవుట్ గా ప్రకటించడంతో స్టేడియంలో ప్రేక్షకులు రెచ్చిపోయారు. చివరికి సచిన్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి.. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగన్ మోహన్ దాల్మియాతో కలిసి వచ్చి ప్రేక్షకులను శాంతింపజేశాడు.