పోరాడి ఆతిథ్య హక్కును నిలుపుకున్న పాక్!
టోర్నీ హైబ్రిడ్ మోడల్లో జరిగినా, ఆతిథ్య హక్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వద్దే ఉంది. అంటే, టోర్నీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పీసీబీ చేస్తుంది. మొత్తం టోర్నీని వేరే దేశానికి మార్చాలని బీసీసీఐ డిమాండ్ చేసింది. దక్షిణాఫ్రికా లేదా ఐసీసీ ప్రధాన కార్యాలయం ఉన్న యూఏఈకి టోర్నీని మార్చవచ్చనే వార్తలు వచ్చాయి. కానీ, చాలా కష్టపడి పీసీబీ ఆతిథ్య హక్కును నిలుపుకుంది.