హఫీజ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తూ నానాటికీ ఎదుగుతున్నది. గతేడాది మాదిరే ఈ సారి కూడా భారత్ పై కచ్చితంగా గెలుస్తాం. టీమిండియాకు సంబంధించినంతవరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కీలక ఆటగాళ్లు. ఈ ఇద్దరూ ఆడకుంటే మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేరు. పాక్ వంటి మెరుగైన జట్టుతో ఆడేప్పుడు ఈ ఇద్దరూ పరుగులు చేయకుంటే ఆ ప్రభావం ఇతర ఆటగాళ్ల మీద కూడా పడుతుంది..