భారత జట్టు విషయానికి వస్తే పేస్ బౌలింగ్ విభాగంలో గాయాల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆకాష్ దీప్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. అర్ష్దీప్ సింగ్ చేతి గాయంతో టెస్టు మ్యాచ్కు దూరమయ్యాడు. అతను చివరి మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం.
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్ మాత్రమే ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ విభాగంలో ఫిట్ గా ఉన్నారు.
24 ఏళ్ల అన్షుల్ కంబోజ్ను రిజర్వ్గా జట్టులోకి తీసుకున్నారు. శనివారం అతను భారత జట్టులో చేరాడు. ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లను కలుసుకున్న కాంబోజ్, సోమవారం నెట్ సెషన్లో పూర్తి వేగంతో బౌలింగ్ చేశాడు.
అతని లైన్-లెంగ్త్ బౌలింగ్, క్రమశిక్షణ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ సహా కోచింగ్ సిబ్బందిని మెప్పించడంతో జట్టులోకి వచ్చాడు.