అయితే మరి దుబాయ్ ప్రతిపాదనకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఇటీవలే తనను కలిసిన విలేకరులతో గంగూలీ మాట్లాడుతూ.. భారత్-పాక్ సిరీస్ గురించి తాను గానీ, పీసీబీ చైర్మెన్ రమీజ్ రాజా గానీ ఏమీ చేయలేమని అది ఇరు దేశాల ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.