5. విరాట్ కోహ్లీ సెంచరీ, శ్రేయాస్ క్లాసిక్ ఇన్నింగ్స్
చాలా కాలంగా ఫామ్తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఫామ్లోకి వచ్చాడు. పాకిస్థాన్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 100 పరుగుల అజేయ సెంచరీతో పాటు భారత్ కు విజయాన్ని అందించాడు.
స్కోర్ బోర్డు:
పాకిస్తాన్ : 241 (49.4 Ov) పరుగులు (సౌద్ షకీల్ 62, మహ్మద్ రిజ్వాన్ 46, కుష్ దిల్ 38 పరుగులు - కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, హర్దిక్ పాండ్యా 2 వికెట్లు)
భారత్: 244-4 (42.3 Ov) పరుగులు (విరాట్ కోహ్లీ 100*, శ్రేయాస్ అయ్యర్ 56, గిల్ 46, రోహిత్ శర్మ 20 పరుగులు - షాహీన్ అఫ్రిది 2 వికెట్లు)