భారత క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ షాక్.. కొత్త రూల్స్

Published : Jan 17, 2025, 08:48 AM ISTUpdated : Jan 17, 2025, 09:28 AM IST

BCCI New rules: ఆస్ట్రేలియాలో భారత జ‌ట్టు పేలవమైన ప్రదర్శన తరువాత బీసీసీఐ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. జాతీయ జట్టు ఎంపిక కోసం దేశవాళీ మ్యాచ్ లలో పాల్గొనడాన్ని బీసీసీఐ తప్పనిసరి చేసింది. కొత్త రూల్స్ ను బీసీసీఐ తీసుకువచ్చింది.   

PREV
16
భారత క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ షాక్.. కొత్త రూల్స్

BCCI New rules: గత కొంత కాలంగా భారత క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న‌ది. ఆట‌గాళ్లు కూడా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జ‌ట్టు ప‌రిస్థితి మ‌రింత దిగ‌జార‌క‌ముందే పరిస్థితిని చక్కదిద్దేందుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) చ‌ర్య‌లు ప్రారంభించింది. 

తీవ్ర చర్చల అనంతరం బోర్డు గురువారం 10 పాయింట్ల విధానాన్ని సమర్పించింది. ఇప్పుడు క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి చేసింది. అలాగే, విదేశాలకు లేదా ఇతర నగరాలను సందర్శించేటప్పుడు కుటుంబాలు, వ్యక్తిగత ఉద్యోగుల ఉనికిపై కూడా ఆంక్షలు విధించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

26

10 పాయింట్ల‌తో బీసీసీఐ కొత్త విధానం

 

భారత క్రికెట్ జట్టు ప్ర‌ద‌ర్శ‌న‌ నిరంతరం క్షీణిస్తున్న త‌రుణంలో ప‌రిస్థితి మ‌రింత ఘోరంగా మార‌క‌ముందే బీసీసీఐ కొన్న చ‌ర్య‌లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టింది. దీనిలో భాగంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) గురువారం 10 పాయింట్ల విధానాన్ని సమర్పించింది. భారత జట్టు ప్రదర్శనను మెరుగుపరచడమే దీని ప్ర‌ధాన‌ ఉద్దేశంగా స్ప‌ష్టం చేసింది. 

కొత్త విధానాల ప్ర‌కారం.. ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి చేసింది. ఇది కాకుండా, విదేశాలకు లేదా ఇతర నగరాలను ప్లేయ‌ర్లు సందర్శించేటప్పుడు కుటుంబ స‌భ్యులు, వ్యక్తిగత ఉద్యోగుల ద‌గ్గ‌ర ఉండ‌టంపై కూడా ఆంక్షలు కొన‌సాగుతాయ‌ని పేర్కొంది. జట్టులో క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బోర్డు ఈ చర్య తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

36

నిబంధనలను పాటించకపోవడం వల్ల భార‌త్ ప‌రిస్థితి దిగ‌జారిందా?  

 

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు 1-3తో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లోనూ భార‌త జ‌ట్టు ఓడిపోయింది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ గురువారం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పాల్గొన్నారు. 

గంభీర్ మాట్లాడుతూ ఆటగాళ్లు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారని ఆరోపించార‌ని స‌మాచారం. ఇప్పుడు కొత్త నిబంధనలను అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఆటగాళ్లు ఈ నిబంధనలను పాటించకుంటే బీసీసీఐ నుంచి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. కేంద్ర కాంట్రాక్టుల నుండి వారి రిటైనర్ ఫీజు మినహాయింపు, ఐపీఎల్ లో పాల్గొనకుండా నిషేధంతో సహా వారికి జరిమానా విధించే చ‌ర్య‌ల‌ను పేర్కొంది. 

46
Cricket, India, IND vs AUS, Team india,

టూర్ లలో ప్లేయ‌ర్ల‌తో కుటుంబాలు ఉండ‌కూడ‌దు

 

 

విదేశీ టూర్‌లో కుటుంబాలు రెండు వారాలకు మించి ఆటగాళ్లతో ఉండడానికి వీల్లేదని గురువారం విడుదల చేసిన నివేదికలో బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. 1.5 నెలల ఆస్ట్రేలియా పర్యటనలో కుటుంబాల‌తో ఆటగాళ్లు కలిసి కూర్చున్నారని గౌతమ్ గంభీర్ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఒక్కసారి మాత్రమే భోజనం చేశారు. ఇది కాకుండా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో చాలా మంది ఆటగాళ్ల భార్యలు, వారి వ్యక్తిగత మేనేజర్లు ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని కనిపించారు. ఇప్పుడు దీన్ని అరికట్టాలని నిర్ణయించిన బీసీసీఐ నిర్ణ‌యం తీసుకుంది.

ఆటగాళ్ల కుటుంబాలు పర్యటనల్లో వారితో కలిసి ఉండేందుకు కేవలం రెండు వారాలు మాత్రమే అనుమతించింది. అంతే కాకుండా ప్రైవేట్ సిబ్బంది, కమర్షియల్ షూటింగ్‌లపై కూడా ఆంక్షలు విధించారు. భారత జట్టులో క్రమశిక్షణను పెంపొందించేందుకు బీసీసీఐ పెద్ద అడుగు వేసింది, దేశవాళీ క్రికెట్ ఆడటం తప్పనిసరి చేసింది.

56
Cricket, India, IND vs AUS, Team india,

భార‌త జ‌ట్టు టూర్ ల‌కు ప్లేయ‌ర్లు అంద‌రూ క‌లిసి వెళ్లాల్సిందే : బీసీసీఐ

 

టూర్‌లో ప్లేయ‌ర్లు విడిగా ప్రయాణించేందుకు ఎలాంటి అనుమతులు ఉండవని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. ఒకవేళ టూర్ లేదా మ్యాచ్ ముందుగానే ముగిస్తే, ఆటగాళ్లు ముందుగానే బయలుదేరడానికి అనుమతించబడరని కూడా పేర్కొంది. అంతే కాకుండా ఆటగాళ్ల అదనపు లగేజీని తీసుకెళ్లేందుకు కూడా నిబంధనలు రూపొందించారు. 

66
Rohit Sharma, Virat Kohli, Gautam Gambhir

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే ప్లేయ‌ర్ల‌పై బీసీసీఐ క‌ఠిన చ‌ర్య‌లు 

 

నిబంధనల ఉల్లంఘనపై బీసీసీఐ ప్లేయ‌ర్ల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది. బోర్డు పాలసీ ప్రకారం, 'దీని నుండి ఏదైనా మినహాయింపులు పొందాల‌నుకుంటే తప్పనిసరిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్, ప్రధాన కోచ్ ద్వారా ముందుగా ఆమోదించబడాలి. దీన్ని పాటించడంలో విఫలమైతే బీసీసీఐ తగిన విధంగా క్రమశిక్షణా చర్య తీసుకోవలసి ఉంటుందని బీసీసీఐ స్ప‌ష్టం చేసింది. 

అలాగే, 'ఇంకా, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL)తో సహా బీసీసీఐ నిర్వహించే అన్ని టోర్నమెంట్‌లలో పాల్గొనకుండా సంబంధిత ఆటగాడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే హక్కును బీసీసీఐ కలిగి ఉంటుంది. బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్ట్ ప్రకారం రిటైనర్ మొత్తాన్ని లేదా మ్యాచ్‌లను జప్తు చేస్తుంది. భారీ జ‌రిమానాలు కూడా విధిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories