1. టాప్ ఆర్డర్ వైఫల్యం: రోహిత్ (8), కోహ్లీ (0), గిల్ (10) తక్కువ స్కోరు చేయడంతో భారత్ మొదటినుంచే ఒత్తిడిలో పడింది.
2. వర్షం అంతరాయం : వర్షం కారణంగా పలుమార్లు ఆట ఆగడంతో భారత బ్యాట్స్మన్లు రిథమ్ను కోల్పోయారు. మ్యాచ్ 26 ఓవర్లకు తగ్గించబడడం స్కోరును ప్రభావితం చేసింది.
3. మిడిల్ ఓవర్లలో స్థిరత్వం లేకపోవడం: శ్రేయస్ అయ్యర్ (11) తర్వాత కూడా బ్యాటింగ్లో భాగస్వామ్యాలు కుదరకపోవడంతో పరుగులు తగ్గాయి.
4. ఆస్ట్రేలియా బౌలర్ల కచ్చితత్వం: హేజిల్వుడ్, స్టార్క్, క్యూనమన్ల సమన్వయంతో భారత్పై ఒత్తిడి కొనసాగింది.
5. టార్గెట్ తక్కువ కావడం: రాహుల్ (38), అక్షర్ (31) పోరాడినా, మొత్తం 136/9 స్కోరు ఆస్ట్రేలియా వంటి జట్టుకు పెద్ద టార్గెట్ గా మారలేదు. అలాగే, బౌలర్లు రాణించకపోవడంతో ఆసీస్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది.
సిరీస్లో ఆధిక్యంలో ఆస్ట్రేలియా
ఈ విజయం తర్వాత ఆస్ట్రేలియా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు రెండో వన్డే అక్టోబర్ 23న అడిలైడ్లో జరగనుంది. భారత్ రివర్స్ కమ్బ్యాక్ కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియా అయితే ఈ సిరీస్ను మరో మ్యాచ్ కు ముందే కైవసం చేసుకోవాలని చూస్తోంది.