అమిత్ మిశ్రా కెరీర్ మొత్తం రెండు దశాబ్దాలకుపైగా కొనసాగింది. భారత్ తరపున 22 టెస్టులు, 36 వన్డేలు, 10 టీ20లు ఆడి, వరుసగా 76, 64, 16 వికెట్లు తీశాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో 152 మ్యాచ్ల్లో 535 వికెట్లు, దేశీయ టి20లు (ఐపీఎల్ సహా) 259 మ్యాచ్ల్లో 285 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 162 మ్యాచ్లు, 174 వికెట్లు సాధించి, టోర్నీ చరిత్రలో ఏడో అత్యధిక వికెట్ టేకర్గా నిలిచాడు. అంతర్జాతీయ వేదికలో చివరిసారి 2017లో ఆడిన మిశ్రా, అప్పటి నుంచి దేశీయ టోర్నీలతో పాటు ఐపీఎల్లో కొనసాగాడు. 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్ అతని చివరిది.