ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్లో 300కు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అభిషేక్ శర్మ ఎనిమిదో ఆటగాడిగా చేరాడు. ఇంతకు ముందు ఈ ఘనత తిలకరత్నే దిల్షాన్, మహేలా జయవర్ధనే, విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్, బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఫిల్ సాల్ట్లకు దక్కింది.
• 331 – ఫిల్ సాల్ట్, ఇంగ్లాండ్ (2023)
• 319 – విరాట్ కోహ్లీ, భారత్ (2014)
• 317 – తిలకరత్నే దిల్షాన్, శ్రీలంక (2009)
• 316 – మొహమ్మద్ రిజ్వాన్, పాకిస్థాన్ (2022)
• 309 – అభిషేక్ శర్మ, భారత్ (2025)
ఇలాంటి అద్భుత ప్రదర్శనతో అభిషేక్ శర్మ తన మొదటి ఆసియా కప్లోనే సంచలన ప్రదర్శనతో రికార్డుల మోత మోగిస్తున్నాడు.