Zomato : ఫుడ్ డెలివరీ బిల్ ఫోటో వైరల్ .. ఇలాగైతే నెలకు ఈజీగా రూ.3-4 వేలు ఆదా..!

Published : Oct 07, 2025, 07:48 PM IST

Zomato : గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు ఖరీదయ్యాయి. అప్పటికి ఇప్పటికి ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ ధరల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికన పంచుుకున్నాడు. ఈ బిల్ వైరల్ గా మారింది. 

PREV
17
ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యమ ఖరీదు గురూ..!

Zomato : భారతదేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ యాప్‌ల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇళ్లు, ఆఫీసుల్లో కూర్చుని ఇష్టమైన హోటల్ నుంచి నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా ఆర్డర్ చేసే ఆహారం ధర సాధారణ ధర కంటే ఎక్కువగా ఉంటుంది.

27
వాచిపోయేలా ఆన్లైన్ ఫుడ్ బిల్

ఆన్‌లైన్ ఫుడ్ బిల్లులో డెలివరీ ఛార్జ్, ప్లాట్‌ఫారమ్ ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జ్, జీఎస్టీ ఉంటాయి. ఉదాహరణకు ఓ హోటల్‌లో దోసె ధర 75 రూపాయలు అయితే ఆన్‌లైన్‌లో అదే దోసె ధర 180 రూపాయలు అవుతుంది. ఫుడ్ డెలివరీ సంస్థలు అనేక ఛార్జీలను వినియోగదారుడి నుండి వసూలు చేస్తాయి.. అందుకే హోటల్ నుండి వినియోగదారుడికి చేరేవరకు డబ్బులు డబుల్ అవుతాయి. 

37
ఒకప్పుడు ఇలా కాదు... ఓ నెటిజన్ బిల్ వైరల్

ఒక వ్యక్తి ఏడేళ్ల కిందటి జొమాటో బిల్లు ఫొటోను షేర్ చేశారు. ఈ బిల్లు చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లులో ఆహారం ధర తప్ప మరే ఇతర ఛార్జీలు చేర్చలేదు. నేటి బిల్లులో వర్షం వస్తే రెయిన్ ఛార్జ్ కూడా యాడ్ చేస్తారు. హోటల్‌లో చెల్లించే దానికంటే రెట్టింపు డబ్బు ఆన్‌లైన్ ఆర్డర్‌కు చెల్లించాల్సి వస్తుంది.

47
7 ఏళ్ల కిందటి బిల్లులో ఏముంది?

ఏడేళ్ల క్రితం ఒక వ్యక్తి జొమాటో ప్లాట్‌ఫారమ్ నుండి పనీర్ మలై టిక్కాను ఆర్డర్ చేశారు. దీని ధర 160 రూపాయలు. హోటల్ నుండి 9.6 కి.మీ దూరంలో ఉన్న ప్రదేశానికి డెలివరీ చేయాలి. కస్టమర్ కూపన్ కోడ్ ఉపయోగించడం వల్ల ఆర్డర్ ధర 92 రూపాయలు అయింది. ఈ బిల్లులో ఎలాంటి అదనపు ఛార్జీలు చేర్చలేదు.

57
2019 లో ధరలు కూడా తక్కువే

2019 నాటి ఈ ఆర్డర్ బిల్లును చూస్తే… అప్పట్లో అందుబాటు ధరలో ఆహారాన్ని ఆర్డర్ చేసేవారని తెలుస్తుంది. అప్పట్లో సాధారణంగా హోటల్ ధరకే ఆన్‌లైన్ ఆర్డర్ ధర ఉండేది. ఈ రోజుల్లో ఆహారం ధర కంటే దానిపై విధించే ఛార్జీలే ఎక్కువగా ఉంటున్నాయని నెటిజన్లు వాపోతున్నారు.

67
పనీర్ మలై టిక్కా ఆర్డర్

ఈ రోజుల్లో జొమాటోతో సహా ఏ ప్లాట్‌ఫారమ్ ద్వారా అయినా ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా ఖరీదుగా మారింది. ఈ రోజు అదే పనీర్ మలై టిక్కాను ఆర్డర్ చేస్తే కనీసం 300 రూపాయలు అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హోటల్ దగ్గరలో ఉన్నా కస్టమర్లకు ఎలాంటి డిస్కౌంట్లు రావడం లేదని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

77
ఇప్పుడు అన్నీ ఖరీదే...

ఒక నెటిజన్ 2019 బిల్లును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి బిల్లు ఉంటే నెలకు 3 నుంచి 4 వేల రూపాయలు ఆదా చేసేవాడినని అన్నారు. పని ఒత్తిడి వల్ల ఆన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్ చేయడం తప్పనిసరి అయిందని చెప్పారు. ఈ పోస్ట్‌కు స్పందిస్తూ, ఈ రోజుల్లో అన్నీ ఖరీదయ్యాయని, ఆనాటి తక్కువ ధరను ఈ బిల్లులో చూడవచ్చని మరొకరు కామెంట్ చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories